News June 17, 2024
పల్నాడు: రైతు భరోసా కేంద్రంలో చోరీ

ఈపూరు మండలంలోని కొండ్రముట్ల రైతు భరోసా కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి రైతు భరోసా కేంద్రం తాళాలు పగులగొట్టి, కంప్యూటర్, టీవీలను చోరీ చేశారు. ఆదివారం ఉదయం అటువైపు వెళుతున్న రైతు ఒకరు రైతు భరోసా కేంద్రం తెరిచి ఉండటం చూసి వ్యవసాయశాఖ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వ్యవసాయశాఖ ఏవో రామినేని రామారావు తెలిపారు.
Similar News
News September 14, 2025
GNT: నేడు ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్న వకుల్ జిందాల్

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10.30 గంటలకు డీపీఓలోని ఎస్పీ ఛాంబర్లో ఆయన బాధ్యతలు తీసుకుంటారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన విజయనగరం నుంచి గుంటూరుకు బదిలీ అయ్యారు. ఎస్పీ బాధ్యతల స్వీకరణ కోసం పరిపాలనా సిబ్బంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
News September 14, 2025
గుంటూరు జిల్లాలో దంచికొట్టిన వర్షం

గుంటూరు జిల్లాలో శనివారం వర్షం దంచికొట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. మధ్యాహ్నం మొదలైన వర్షం పలు ప్రాంతాల్లో రాత్రి వరకు కురుస్తూనే ఉంది. వర్షంతో పాటు పిడుగులు, ఈదురుగాలులు కూడా వీయడంతో ప్రజలు అసౌకర్యం వ్యక్తం చేశారు. పిడుగులు పడి పెదనందిపాడు మండలంలో ఇద్దరు, పెదకాకాని మండలంలో మరో ఇద్దరు మహిళా కూలీలు మృత్యువాత పడ్డారు. పలు చోట్ల అధిక వర్షం కారణంగా కాలువలు నిండి నీరు రోడ్లపైకి చేరింది.
News September 14, 2025
గుంటూరు: నష్టపరిహారంగా రూ.1.11 కోట్లు

గుంటూరు జిల్లాలో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 11,388 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి. ఇందులో సివిల్ కేసులు 908, క్రిమినల్ కేసులు 10,480 ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీనివాసుల కుటుంబానికి రూ.1.11 కోట్లు పరిహారం అందజేయడం ప్రధానంగా నిలిచింది. ప్రజలు సమయం, డబ్బు ఆదా చేసుకునేలా ఈ వేదికను మరింతగా వినియోగించుకోవాలని జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి తెలిపారు.