News March 24, 2025

పల్నాడు: లెక్కల పరీక్షకు 25, 212 మంది విద్యార్థుల హాజరు

image

పల్నాడు జిల్లాలో సోమవారం నిర్వహించిన పదో తరగతి గణితం పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 128 సెంటర్లలో 25,212 మంది విద్యార్థులు హాజరయ్యారు. డీఈవో చంద్రకళ మాట్లాడుతూ.. 99.06శాతం ఉన్నట్లు తెలిపారు. 128 పరీక్షా కేంద్రాలను పరిశీలించేందుకు 22 సిట్టింగ్ స్క్వాడ్లు, 13 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా వినుకొండ, నూజెండ్ల పరీక్షా కేంద్రాలను స్వయంగా పరిశీలించడం జరిగిందని అన్నారు.

Similar News

News March 26, 2025

వనపర్తి: ఎండలు మండిపోతున్నాయ్.. జాగ్రత్త..!

image

> ఆరు బయట పని చేస్తుంటే మధ్య మధ్యలో నీడలో విశ్రాంతి తీసుకోండి.> పిల్లల్ని ఎండలో ఆడనివ్వకపోవడమే మంచిది.> ఎండలో ఎక్సర్‌సైజ్‌లు చేయొద్దు.> కండరాల్లో, కడుపులో నొప్పి వస్తుంటే ఎండ వల్ల కావచ్చు.> తప్పనిసరి అయితే తప్ప ఎండలో బయటికి వెళ్లొద్దు.. ఒకవేళ వెళ్లిన లేదా రంగు దుస్తులు ధరించండి. టోపీ, గొడుగు వంటివి వెంట తీసుకెళ్లండి.> దాహం వేయకపోయినా తరచూ నీరు తాగుతూ ఉండండి.

News March 26, 2025

చేనేత కళాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఇందిర తెలిపారు. ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7- 2025 సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులను ప్రదానం చేయడానికి అర్హతలతో దరఖాస్తులు కోరుతోందిని వివరించారు. ఏప్రిల్ 15లోపు చేనేత నుంచి HYDలోని చేనేత జౌళి శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

News March 26, 2025

వనపర్తి: కూరగాయలు, పండ్లు పాడవుతున్నాయా? ఇలా చేయండి..

image

✓ కూరగాయలను నేరుగా వేడి తాకే ప్రదేశంలో పెట్టవద్దు. ✓ ఫ్రిజ్ టెంపరేచర్ 4°C లేదా అంతకంటే తక్కువే ఉంచాలి. ✓ ఫ్రిజ్ అంతా సరుకులతో నింపకుండా గాలి తాకేలా స్పేస్ ఉంచాలి. ✓ అరటి, ఆపిల్, టమాటా, అవకాడో లాంటి పండ్లు, కూరగాయలు ఇథలిన్‌ను విడుదల చేస్తాయి. వాటి వల్ల మిగిలినవీ త్వరగా పండుతాయి. అలా కాకుండా ఉండాలంటే వాటిని వేరువేరుగా ఉంచాలి. ✓ త్వరగా పాడయ్యే వాటిని ముందు వాడుకోవడం ఉత్తమం.

error: Content is protected !!