News March 27, 2025
పల్నాడు: విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా

మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏప్రిల్ 2వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కాగా ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్కు మాజీ మంత్రి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News February 20, 2026
ఉమ్మడి ప్రకాశం: కీలక సమావేశానికి రంగం సిద్ధం.!

ఈ నెల 22న అమరావతిలో CM చంద్రబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఇన్ఛార్జ్లు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు పరిస్థితులపై సమగ్రంగా చర్చించనున్నారు. నియోజకవర్గాల్లో చేపట్టిన పనుల పురోగతిని విడివిడిగా సమీక్షిస్తూ, అభివృద్ధిలో వేగం పెంచేందుకు CM దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
News February 20, 2026
ఎడ్యుకేషనల్ హబ్గా సిద్దిపేట అభివృద్ధి: హరీశ్ రావు

సిద్దిపేటను మెడికల్, పారామెడికల్ కాలేజీలు, ఐటీ టవర్తో అతిపెద్ద ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దామని MLA హరీశ్ రావు తెలిపారు. ‘హరీశ్ అన్న ఉద్యోగ యాప్’ ద్వారా ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందిస్తున్నామని చెప్పారు. యువత ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని, మొబైల్ వ్యసనాలకు దూరంగా కష్టపడి చదివితే పేదరికం అడ్డుకాదని సూచించారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని మార్చుకోవాలని పిలుపునిచ్చారు.
News February 20, 2026
ఇతరుల చేతి నుంచి తీసుకోకూడని వస్తువులు ఇవే..

నూనె, ఉప్పు, గుడ్లు.. ఇతరులు ఇస్తున్నప్పుడు వీటిని నేరుగా చేతితో తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ‘శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తికి ఓ ప్రత్యేక శక్తి ఉంటుంది. వస్తు మార్పిడితో ఆ శక్తి బదిలీ అయ్యే అవకాశాలుంటాయి. అలా.. వీటిని తీసుకుంటే వారి నెగటివ్ ఎనర్జీ కూడా రావొచ్చు. తద్వారా వారి కష్టాలు, దోషాలు సైతం అంటుతాయని నమ్మకం. వీటిని కింద పెట్టమని చెప్పి ఆ తర్వాత తీసుకోవడం మంచిది’ అని సూచిస్తున్నారు.


