News January 27, 2025
పల్నాడు శకటానికి ప్రథమ బహుమతి

పల్నాడు జిల్లా మహిళాభివృద్ధి – శిశు సంక్షేమ శాఖ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలో అంగన్వాడీ కేంద్రం, వన్ స్టాప్ సెంటర్, బాధిత మహిళలకు అందించే కౌన్సిలింగ్, వైద్య, న్యాయ, దత్తత, సహాయాలను డిపార్ట్మెంట్ అధికారులు శకటంపై దృశ్య రూపంలో ప్రదర్శించారు. ప్రాజెక్టు జిల్లా అధికారి ఆర్.కుమిదిని కలెక్టర్ పి అరుణ్ బాబు చేతుల మీదగా ప్రథమ బహుమతి అందుకున్నారు.
Similar News
News February 24, 2026
నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు

నిన్న లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ రెడ్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 325 పాయింట్లు పతనమై 82,969 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 116 పాయింట్లు కోల్పోయి 25,596 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇన్ఫోసిస్, HCL టెక్, టీసీఎస్, ఎటర్నల్, టెక్ మహీంద్రా, ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, బెల్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. పవర్గ్రిడ్, టాటా స్టీల్, NTPC షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
News February 24, 2026
గద్వాల: ‘ఇంటర్ పరీక్షల వేళ విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకండి’

ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండి ధైర్యంగా పరీక్షలు ఎదుర్కోవాలని గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.సంధ్య కిరణ్మయి మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. పరీక్షా కేంద్రాలకు కనీసం 30-45 నిమిషాల ముందే చేరుకోవాలని సూచించిన ఆమె, చివరి నిమిషం హడావుడి వల్ల ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు.
News February 24, 2026
సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జపాన్ టూరిస్టుల సందడి

జపాన్ నుంచి నగరానికి వచ్చిన పర్యాటకులు South India Shopping Mallలో సందడి చేశారు. భారతీయ సంప్రదాయం, ఆధునిక డిజైన్లు, విస్తృత కలెక్షన్లు ఒకేచోట లభించడం వారిని ఆకట్టుకున్నట్లు తెలిపారు. దక్షిణ భారత సంప్రదాయ వస్త్రాల నాణ్యత, సరసమైన ధరలు, ఆతిథ్య సేవలు ప్రత్యేకంగా నచ్చాయన్నారు. ‘ఇది జీవితంలో బెస్ట్ షాపింగ్ అనుభవం’ అని వారు పేర్కొన్నారు. విదేశీయులను తమ మాల్ ఆకట్టుకుంటుందని నిర్వాహకులు తెలిపారు.


