News October 22, 2025
పల్నాడు శైవ క్షేత్రాలలో కార్తీక మాసం సందడి

పల్నాడులో ప్రముఖ శైవ క్షేత్రాలైన గుత్తికొండ, దైద, సత్రశాలలో కార్తీక మాసం సందడి నెలకొంది. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. దైద, సత్రశాల ఆలయాలు కృష్ణా నది పక్కనే ఉండడంతో నదిలో మహిళలు ప్రత్యేక పుణ్య స్నానాలు చేశారు. అనంతరం గుత్తికొండ ఓంకారేశ్వరుడు, దైద అమరలింగేశ్వర స్వామి, సత్రశాల మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Similar News
News October 22, 2025
మనుబోలు: హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

మనుబోలు మండలం కాగితాల పూర్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బొలెరో, బైక్ ఢీకొనడంతో బుధవారం అక్కడికక్కడే మహిళ మృతి చెందింది. గొట్లపాలెం నుంచి కాగితాల పూర్కు బైకుపై హైవే క్రాస్ చేస్తుండగా బొలెరో ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న కాగితాల పూర్కి చెందిన కొండూరు సుప్రజ(40) మృతిచెందగా, కొడుకు రాకేష్ గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 22, 2025
ఇల్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలి: కొలుసు

AP: పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే 50% ఇళ్లు మంజూరు చేశామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు వచ్చేనెల 5 వరకు సర్వే నిర్వహిస్తామని, ఇళ్లు లేనివారు అప్పటివరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7.28లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. 16నెలల్లోనే రూ.7.65లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై 75.1% ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు.
News October 22, 2025
ములుగు: ‘డీసీసీ’ పీఠంపై అదే ఉత్కంఠ..!

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెలాఖరుకు నూతన అధ్యక్షుని ప్రకటన వెలువడే అవకాశముంది. ఆరుగురు సీనియర్ నాయకులు ఏఐసీసీ పరిశీలకుడికి దరఖాస్తు చేసుకొని ఉన్నారు. ఇప్పటికే డీసీసీ ప్రెసిడెంట్గా పని చేసిన వారికి కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్ చేసిన ప్రకటన ఆలోచనలో పడేసింది. ఆ ఆరుగురు అధిష్ఠానం కరుణకోసం తీవ్రంగా తండ్లాడుతున్నారు.