News March 21, 2024

పల్నాడు: సజావుగా పదో తరగతి పరీక్షలు

image

జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహిస్తున్నట్లు డీఈవో ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు. 127 కేంద్రాల్లో బుధవారం విద్యార్థులకు ఆంగ్ల పరీక్ష నిర్వహించారు. జిల్లాలో 25,423 మందికి 24,931 మంది హాజరయ్యారు. ఫ్లైయింగ్ స్వ్కాడ్ బృందాలు 60 కేంద్రాల్లో తనిఖీ చేసినట్లు తెలిపారు. మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. తాను వినుకొండలో మూడు కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు. 

Similar News

News April 1, 2025

విధుల్లో అలసత్వం వహించరాదు: కలెక్టర్ 

image

గ్రామ సచివాలయ సిబ్బంది విధుల్లో అలసత్వం వహించరాదని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది స్నేహపూరితమైన వాతావరణంలో మెలగాలని అన్నారు. సమయపాలన పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 31, 2025

జనసేనపై అంబటి రాంబాబు ట్వీట్

image

జనసేనపై మరోసారి మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు తనదైన శైలిలో ట్విటర్‌లో విమర్శలు చేశారు. ‘బాబుకు సుత్తి కొట్టడమే.. సత్తా లేని జనసేన పని.!’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏ పని చేసినా, దానిని గుడ్డిగా సమర్థించడమే పవన్ కళ్యాణ్‌కు పనిగా మారిందని కొంతమంది కామెంట్లు చేయగా, అంబటి రాంబాబును విమర్శిస్తూ మరి కొంతమంది ఆ ట్వీట్ కింద కామెంట్లు చేస్తున్నారు. 

News March 31, 2025

గుంటూరు నగరంలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

image

గుంటూరు నగరంలో సోమవారం ఎస్పీ సతీశ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు నిర్వహిస్తున్న తీరును తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బందిలో వివిధ నిర్వాహణలో జవాబు దారీతనాన్ని పెంపొందించడానికి ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. 

error: Content is protected !!