News November 23, 2025

పవన్ ఏలూరు జిల్లా పర్యటనలో స్వల్ప మార్పు

image

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపటి ఏలూరు జిల్లా పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. తొలుత హెలికాప్టర్‌లో రాజవరం రావాల్సి ఉండగా.. ప్రస్తుతం రోడ్డు మార్గంలో రానున్నారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి బయలుదేరి కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల, రాజవరం మీదుగా ఐ.ఎస్‌.జగన్నాధపురం చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Similar News

News November 23, 2025

తిరుపతి: అమ్మవారి పంచమీ తీర్థానికి ప‌టిష్ఠ ఏర్పాట్లు

image

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పంచమీ తీర్థానికి విచ్చేసే భ‌క్తుల సౌక‌ర్యార్థం టీటీడీ ప‌టిష్ఠ ఏర్పాట్లు చేప‌ట్టింది. పంచమీ తీర్థం అవసరమైన క్యూలైన్లు, బ్యారీకేడ్లు, ప‌ద్మ‌పుష్క‌రిణిలోనికి ప్ర‌వేశ‌, నిష్క్ర‌మ‌ణ గేట్లు, సూచిక బోర్డులు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీటీడీ భ‌ద్ర‌త, నిఘా విభాగం ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టింది.

News November 23, 2025

పల్నాడు ఉత్సవాల్లో అపశ్రుతి

image

పల్నాడు ఉత్సవాల్లో ఆదివారం ముగింపు వేళ విషాదం చోటుచేసుకుంది. నాగులేరులో స్నానాలు చేస్తున్న సమయంలో విద్యుత్ వైర్ ఆకస్మికంగా తెగి పడటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను వెంటనే నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 23, 2025

రూ.485కే 72 రోజుల ప్లాన్

image

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తక్కువ ధరకే కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా 72 రోజుల స్మార్ట్ సేవింగ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.485తో రీఛార్జ్ చేస్తే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 2GB డేటా, 100 SMSలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఇదే తరహా ప్లాన్లు మిగతా టెలికాం కంపెనీల్లో దాదాపు రూ.700-800 రేంజ్‌లో ఉన్నాయి.