News January 3, 2026
పవన్ కళ్యాణ్కు స్వాగతం పలకనున్న మంత్రి అడ్లూరి

నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా ఆయనకు తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వాగతం పలకనున్నారు. పర్యటనకు సంబంధించిన భద్రత, ట్రాఫిక్, భక్తులకు సౌకర్యాలు సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. కొండగట్టులో పర్యటన సజావుగా సాగేందుకు శాఖల సమన్వయం పాటించాలని సూచించారు.
Similar News
News February 13, 2026
GNT: జెడ్పీటీసీ విభజనపై కసరత్తు

ఉమ్మడి గుంటూరు జిల్లా మూడు జిల్లాలుగా విడిపోయిన నేపథ్యంలో జెడ్పీటీసీ స్థానాల పునర్విభజనపై ఎన్నికల కమిషన్ చర్యలు ప్రారంభించింది. పల్నాడులో 28 జెడ్పీటీసీలు ఉండగా, గుంటూరు, బాపట్లలో కూడా విభజన పనులు కొనసాగుతున్నాయి. 3 జిల్లా పరిషత్లు ఏర్పడే అవకాశంతో ఛైర్మన్ పదవులపై నేతలు దృష్టి పెట్టారు. గతంలో ఎన్నికలు జరగని పంచాయతీలలో ఓటర్ల జాబితాలలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం.
News February 13, 2026
GNT: మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు కసరత్తు

గుంటూరు జిల్లాలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల కోసం ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. మార్చి 9 లోపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచనలు అందుకున్నారు. 2026 జనవరి 1 నాటి డేటాను ఆధారంగా తీసుకుని గ్రామాల వారీగా జాబితాలు రూపొందిస్తున్నారు. కాగా పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగనున్నాయి.
News February 13, 2026
First Time: ట్రాన్స్జెండర్ విజయం

TG: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో ట్రాన్స్జెండర్ విజయం సాధించారు. కాంగ్రెస్ బలపర్చిన సీపీఎం అభ్యర్థి నగేశ్పై ఇండిపెండెంట్ అభ్యర్థి నాగిళ్ల కావేరి సుధాకర్ (ట్రాన్స్జెండర్) 109 ఓట్ల మెజారిటీతో కౌన్సిలర్గా గెలుపొందారు. రాష్ట్రంలో ట్రాన్స్జెండర్ గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.


