News January 30, 2026

పవన్ కళ్యాణ్‌ని కలిసిన విజయనగరం మత్స్యకార కుటుంబ సభ్యులు

image

భోగాపురం, పూసపాటిరేగ తీరప్రాంతం మండలాలకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు ఇటీవల బంగ్లాదేశ్ నుంచి విడుదల అయిన సంగతి తెలిసిందే. మత్స్యకారులు బంగ్లాదేశ్ చెర నుంచి విడిపించడంలో కూటమి ప్రభుత్వం చేసిన కృషికి మత్స్యకార కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కలిశారు. ప్రభుత్వం నుంచి మరింత సహాయం అందేలా చూడాలని పవన్ కళ్యాణ్‌ని మత్యకారులు కోరారు.

Similar News

News February 1, 2026

విజయనగరం: సీఎం పర్యటనకు స్థల పరిశీలన

image

విజయనగరం జిల్లాలోని రేగిడి ఆమదాలవలస మండలం వన్నలిలో ఈ నెల 9న సీఎం చంద్రబాబు రానున్నారని సమాచారంతో ప్రత్యేక డిప్యుటీ కలెక్టర్ ప్రమీలగాంధీ శనివారం గ్రామాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ గ్రామంలో రీసర్వే బాగుండడంతో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారన్నారు. తహశీల్దార్ కృష్ణలత పాల్గొన్నారు.

News February 1, 2026

విజయనగరం: భార్య మందలించిందని భర్త ఆత్మహత్య

image

మద్యానికి బానిసైన భర్తను భార్య మందలించడంతో పురుగులమందు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చింతాడలో చోటు చేసుకుంది. ఎన్.లక్ష్మణరావు నిత్యం మద్యం తాగడంతో భార్య రామలక్ష్మి గతనెల 30న మండలించారు. దీంతో పురుగులమందు తాగడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఏఎస్ఐ కొండలరావు తెలిపారు.

News February 1, 2026

VZM: వ్య‌వ‌సాయ అధికారుల డైరీని ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్‌

image

ఏపీ వ్య‌వ‌సాయ అధికారుల సంఘం ప్ర‌చురించిన 2026 డైరీని, పోస్ట‌ర్ల‌ను క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి శ‌నివారం త‌మ ఛాంబ‌ర్‌లో ఆవిష్క‌రించారు. వ్య‌వ‌సాయ అధికారుల‌కు త‌మ విధి నిర్వ‌హ‌ణ‌లో ఈ డైరీ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. విజయనగరం యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో వ్య‌వ‌సాయ‌శాఖ జేడీ వీటీ రామారావు, జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షుడు కె .ప్రకాష్ పాల్గొన్నారు.