News October 16, 2025
పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటన వాయిదా.!

పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటన వాయిదా పడింది. ఈ నెల 16న మోదీ కర్నూలు పర్యటన, దాంతో పాటు వాడపల్లి బ్రహ్మోత్సవాలు జరుగుతుండడంతో పోలీసు బలగాలు ఆ కార్యక్రమాలకు వెళ్లనున్నాయి. ఈ మేరకు దీపావళి అనంతరం రాజోలుకు పవన్ రానున్నట్లు MLA దేవ వరప్రసాద్ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా కేశనపల్లి తీరంలో తోటల పరిశీలన, పల్లెపండుగలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News October 16, 2025
రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం రేపు సాయంత్రం 4 గంటలకు తెరుచుకోనుంది. నెలవారీ పూజల నిమిత్తం అర్చకులు రేపు గుడి తలుపులు తీసి, దీపాన్ని వెలిగిస్తారని ట్రావెన్కోర్ దేవస్థానం తెలిపింది. ఈనెల 18న ఉదయం 5 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటనలో భాగంగా అక్టోబర్ 22న దర్శన సమయాల్లో ఆంక్షలు ఉంటాయంది.
News October 16, 2025
UG&PG విద్యార్థినులకు సైన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రాం

సైన్స్ రంగంలో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థినులకు L’Oréal India స్కాలర్షిప్ అందిస్తోంది. UG&PG విద్యార్థినులు అర్హులు. ఇంటర్లో 85%, డిగ్రీలో 60% మార్కులు వచ్చి, కుటుంబ వార్షికాదాయం రూ.6 లక్షల్లోపు ఉండాలి. UGకి రూ.62,500, PG & PhDకి రూ.1,00,000 వరకు స్కాలర్షిప్ అందుతుంది. చివరి తేదీ: 03-11-2025. మరిన్ని వివరాలకు https://www.loreal.com/, https://www.buddy4study.com/ను సంప్రదించవచ్చు.
News October 16, 2025
నేటి నుండే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి 5వ జాతీయ స్థాయి అండర్ 23 మెన్ అండ్ ఉమెన్ అథ్లెటిక్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర ఛైర్మన్ ఎర్రబెల్లి వరదరాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో క్రీడా పోటీల ప్రాంగణం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఈ పోటీల్లో దేశం నలుమూలల నుంచి 937 మంది అథ్లెట్లు 135 మంది టెక్నికల్ అఫీషియల్స్, కోచులు పాల్గొంటారు.