News December 16, 2024

పవన్ కళ్యాణ్ రేపటి విజయనగరం జిల్లా పర్యటన రద్దు

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కురుపాం నియోజకవర్గ 17వ తేదీ పర్యటన రద్దయినట్లు ఎమ్మెల్యే జగదీశ్వరి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కురుపాం మండలంలోని గ్రామాల్లో మంగళవారం పర్యటించడానికి డిప్యూటీ సీఎం షెడ్యూల్ ఖరారు అయినప్పటికీ రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్న నేపథ్యంలో పర్యటనను రద్దు చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారని కూటమి నాయకులు, అధికారులు గ్రహించాలన్నారు.

Similar News

News December 25, 2025

గంజాయి కేసుల్లో నిందితుడిపై పిట్ NDPS యాక్ట్: VZM SP

image

పలు గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్న పఠాన్ బాషా అలీ (31)పై కఠినమైన పిట్ ఎన్‌డిపిఎస్ చట్టం ప్రయోగించినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గురువారం తెలిపారు. గత నాలుగు సంవత్సరాల్లో 4 గంజాయి కేసుల్లో అరెస్టు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్భంద ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నిందితుడిపై ఇప్పటికే సస్పెక్ట్ షీట్ ఉందని, గురువారం అతడిని నిర్భందించి విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించినట్లు వెల్లడించారు.

News December 25, 2025

42 మందితో విజయనగరం టీడీపీ పార్లమెంటరీ వర్గం

image

విజయనగరం జిల్లా పార్లమెంటరీ కార్యవర్గాన్ని టీడీపీ ప్రకటించింన సంగతి తెలిసిందే. ఇందులో 42 మందికి స్థానం కల్పించింది. ఇందులో తొమ్మిది మంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులను, కార్యదర్శులకు అవకాశమిచ్చింది. మొత్తంగా 13 మంది మహిళలకు స్థానం లభించింది. కాగా నూతన కార్యవర్గంలో బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారని పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు.

News December 25, 2025

డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: VZM SP

image

సైబర్, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ దామోదర్ బుధవారం సూచించారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డులను ఎవరితోనూ పంచుకోవద్దని చెప్పారు. అనుమానాస్పద లింకులు, ఏపీకే ఫైల్స్, క్యూఆర్ కోడ్స్ ఓపెన్ చేయవద్దన్నారు. నకిలీ కాల్స్ చేసి సీబీఐ, ఈడీ, సీఐడీ అధికారులమంటూ బెదిరించే వారిని నమ్మవద్దు అన్నారు.