News January 24, 2026
పశువులకు ‘ఉల్లి’తో సమస్య.. చికిత్స ఇలా

ఒక రోజులో పశువు తినే మొత్తం మేతలో 5 నుంచి 10 శాతానికి మించి ఉల్లిపాయలు ఉండకూడదని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా వారంలో 2-3 రోజులు మాత్రమే ఇవ్వాలన్నారు. ‘ఈ పరిమితి మించితే పశువుల కళ్లు, మూత్రం ఎర్రగా మారిపోతాయి. ఆహారం తీసుకోవు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుల సూచనతో విటమిన్ ఇ, సెలీనియం, ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు, లివర్ టానిక్లు, చార్కోల్ లిక్విడ్ లాంటివి అందించాలి.
Similar News
News February 17, 2026
జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మికి చుక్కెదురు

AP: YS జగన్ అక్రమాస్తుల కేసులో IAS శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. కేసులో తన పేరును తొలగించాలన్న డిశ్ఛార్జ్ పిటిషన్ను SC తిరస్కరించింది. HC తీర్పును సమర్థించింది. నిబంధనలకు అనుగుణంగా తాను పనిచేశానని శ్రీలక్ష్మి విన్నవించగా రూల్స్ను పాటించలేదని CBI వాదించింది. శ్రీలక్ష్మి అండతో ఆమె మరిది భారీగా ఆస్తులు కూడబెట్టారని, ఆమె కూడా నేరుగా లంచం డిమాండ్ చేసినట్లు సాక్షులు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపింది.
News February 17, 2026
AIIMS రిషికేశ్లో కాంట్రాక్ట్ పోస్టులు

AIIMS రిషికేశ్ 3 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BSc నర్సింగ్, బీఫార్మసీ, డీ ఫార్మసీ, BSc మెడికల్ టెక్నాలజీ, BSc (రేడియోలాజికల్ ఇమేజింగ్ టెక్నిక్స్), BSc(కంప్యూటర్ అప్లికేషన్స్) అర్హత గలవారు FEB 23 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫార్మాసిస్ట్, టెక్నీషియన్కు రూ.40K, డేటా ఎంట్రీ ఆపరేటర్కు రూ.30K చెల్లిస్తారు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
News February 17, 2026
ధూపం ఇలా పెడితే..

ధూపంతో ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. అందులో కర్పూరం, లవంగాలు కలిపి వేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. ‘గుగ్గులు ధూపం మనశ్శాంతిని, మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆవు పిడకలపై పసుపు ఆవాల ధూపంతో ప్రతికూల శక్తి నశిస్తుంది. సంపాదన నిలకడగా ఉండాలంటే అగరుబత్తీల ధూపం, వాస్తు దోష నివారణకు వేపాకు ధూపం ఎంతో శ్రేష్ఠం. ఈ ఆచారాలు ఇల్లాంతటా ఆధ్యాత్మిక సుగంధాన్ని, ప్రశాంతతను నింపుతాయి’ అంటున్నారు పండితులు.


