News March 2, 2025
పశ్చిమగోదావరి జిల్లాలో ఊపందుకుంటున్న చికెన్ విక్రయాలు

బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చికెన్ అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. రెడ్జోన్ మినహా అన్ని ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు జరపొచ్చని ఇటీవల కలెక్టర్ ప్రకటన కూడా చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. కిలో రూ.200 వరకు విక్రయిస్తున్నారు. అయితే రెడ్జోన్ పరిధి సమీప ప్రాంతాల్లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కిలోకు అరకిలో మాంసం ఉచితంగా అందజేస్తున్నారు.
Similar News
News October 29, 2025
నరసాపురం: ప్రజలతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

నరసాపురం మండలంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను బుధవారం కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. తొలుత జిల్లా కలెక్టర్ పీఎం లంకలో డిజిటల్ భవన్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి, ఆశ్రయం పొందిన వారిని ఆప్యాయంగా పలకరించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు భోజనాన్ని స్వయంగా వడ్డించి కలెక్టర్ కూడా వారితో పాటు కూర్చుని భోజనాన్ని స్వీకరించారు.
News October 29, 2025
రేపటి నుంచి జిల్లాలో స్కూల్స్ యథాతధం: డీఈవో

మొంథా తుఫాను తీరం దాటిన నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనడంతో రేపటి నుంచి స్కూల్స్ యథాతధంగా పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఈ.నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించినప్పటికీ ప్రస్తుతం వాతావరణం నెమ్మదించడంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురువారం నుంచి యథాతధంగా పనిచేస్తాయని చెప్పారు.
News October 29, 2025
ప.గో. కలెక్టర్తో మాట్లాడిన సీఎం చంద్రబాబు

మొంథా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తతపై సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఫోన్ ద్వారా ప్రత్యేకంగా సమీక్షించారు. తుఫాన్ కంట్రోల్ రూములు, పునరావాస కేంద్రాలపై ముఖ్యమంత్రికు జిల్లా కలెక్టర్ వివరించారు. తుఫాన్ ప్రభవాన్ని ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలిస్తూ ఉండాలని సీఎం సూచించారు.


