News December 28, 2025
పసిపిల్లలకు ఫుడ్ అలవాటు చేసేముందు

ఘనాహారం అలవాటు చేసే ముందు పిల్లలకు పెట్టే ఏ ఆహారమైనా వారి శరీరానికి సరిపడుతుందో, లేదో ఒక్కసారి పరిశీలించాలంటున్నారు నిపుణులు. ముందుగా కొద్ది మొత్తాల్లో వారికి పెట్టి చూడాలి. దీంతో అలర్జీల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే వారికి పెట్టే ఆహారం విషయంలో ఎలాంటి సందేహాలున్నా సంబంధిత నిపుణుల సలహా తీసుకొని వారిచ్చిన న్యూట్రిషన్ ఛార్ట్ ఫాలో అయితే మీ చిన్నారికి చక్కటి పోషకాహారం అందుతుందంటున్నారు.
Similar News
News February 21, 2026
వెయ్యేళ్ల నాటి సమాధిలో బంగారం, పెయింటింగ్స్

పనామాలోని ఎల్ కానో సైట్లో వెయ్యేళ్లకు పైబడిన పురాతన సమాధిని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సుమారు 800-1000AD మధ్య దీన్ని నిర్మించినట్లు లీడ్ రీసెర్చర్ వెల్లడించారు. అక్కడ మానవ అవశేషాలు, సిరామిక్ కళాఖండాలతోపాటు బంగారం కూడా ఉందని తెలిపారు. ‘మృతదేహానికి రెండు కంకణాలు, చెవి పోగులు, ఛాతీ ఆభరణాలు ఉన్నాయి. ఆ కాలంలో ఇతను సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తి అయి ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.
News February 21, 2026
భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలు ఇంటికే!

శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి రాములోరి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే పంపించేందుకు TGSRTC సిద్ధమైంది. రూ.151 చెల్లించి RTC లాజిస్టిక్ కేంద్రాల్లో లేదా ఆన్లైన్లో ఈ నెల 23 నుంచి బుక్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి ప్రకటించారు. భద్రాద్రికి వెళ్లలేని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 040-23450033, 040-69440069కు కాల్ చేయండి. share it
News February 21, 2026
రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో రేపు(FEB 22), ఎల్లుండి(FEB 23) పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. తూ.గో.లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, GNT, అన్నమయ్య, CTR, TPT జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


