News June 10, 2024

పాండురంగాపురం వద్ద ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహం

image

వాడరేవు వద్ద సముద్రంలో ఆదివారం సాయంత్రం గల్లంతైన కావూరివారిపాలెంకు చెందిన జైపాల్ మృతదేహం సోమవారం మధ్యాహ్నం బాపట్ల పక్కన ఉండే పాండు రంగాపురం వద్ద ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. దీంతో అక్కడి మత్స్యకారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాన్ని స్వాధీన పరుచుకుని చీరాల రూరల్ పోలీసులకు విషయాన్ని తెలిపారు. జైపాల్‌తో సహా ముగ్గురు వాడరేవులో సముద్ర స్నానానికి వెళ్లగా ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Similar News

News November 1, 2025

దేవుడు సొమ్ము సైతం గోల్‌మాల్..?

image

నాగులుప్పలపాడు (M) మట్టిగుంట శివాలయ వ్యవసాయ భూమి 41.5 సెంట్ల ద్వారా వచ్చే ఆదాయంలో సుమారు రూ.70 లక్షలు గల్లంతైనట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఏటా రూ.10 లక్షలకు పైగా కౌలు ఆదాయం వస్తున్నా 6 నెలలుగా అర్చకులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో రికార్డులు చూపించడంలో ప్రస్తుత EO విఫలమైనట్లు పలువురు ఆరోపించారు. రికార్డుల నిర్వహణ లోపం వల్ల ఆదాయానికి గండి పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

News November 1, 2025

దేవుడు సొమ్ము సైతం గోల్‌మాల్..?

image

నాగులుప్పలపాడు (M) మట్టిగుంట శివాలయ వ్యవసాయ భూమి 41.5 సెంట్ల ద్వారా వచ్చే ఆదాయంలో సుమారు రూ.70 లక్షలు గల్లంతైనట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఏటా రూ.10 లక్షలకు పైగా కౌలు ఆదాయం వస్తున్నా 6 నెలలుగా అర్చకులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో రికార్డులు చూపించడంలో ప్రస్తుత EO విఫలమైనట్లు పలువురు ఆరోపించారు. రికార్డుల నిర్వహణ లోపం వల్ల ఆదాయానికి గండి పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

News October 31, 2025

నవంబర్ 30 వరకు యాక్ట్ 30 అమలు: DSP

image

ప్రకాశం జిల్లాలో నవంబర్ 1 నుంచి 30 వరకు యాక్ట్ 30 అమల్లో ఉంటుందని ఒంగోలు DSP రాయపాటి శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.