News January 16, 2025

పాకల ఘటన దురదృష్టకరం: S.P ఏ.ఆర్ దామోదర్

image

పాకల బీచ్‌లో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న జిల్లా S.P ఏ.ఆర్ దామోదర్, స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించారు. బీచ్‌లో నలుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. మృతుడు మాధవ సతీమణి నవ్య (21)ను సురక్షితంగా కాపాడగలిగామని S.P తెలియజేశారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.

Similar News

News February 5, 2025

ప్రకాశం: వరల్డ్ కప్‌‌ విజేతకు ఘన స్వాగతం

image

ఢిల్లీలో  జరిగిన ఖోఖో వరల్డ్ కప్‌‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా జట్టు గెలుపులో ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన పోతిరెడ్డి శివారెడ్డి  కీలక పాత్ర పోషించాడు. శివారెడ్డి మంగళవారం తన స్వగ్రామం చేరుకున్నాడు. దీంతో అతనికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ ఊరి కుర్రాడు దేశాన్ని వరల్డ్ ఛాంపియన్‌గా నిలపడం గర్వకారణంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు

News February 4, 2025

దర్శి: గుప్తనిధుల కోసం తవ్వకాలు

image

దర్శి మండలం శివరాజ్ నగర్ శివారులోని శ్రీ సాయిబాబా గుడి శ్రీ దత్తాశ్రమం పక్కనగల కొండ పైన గుర్తుతెలియని కొందరు వ్యక్తులు గుప్తనిధుల కొరకు కొండను తవ్వుతున్నారన్న సమాచారం మేరకు దర్శి ఎస్ఐ మురళి తన సిబ్బందితో దాడి చేశారు. ఈ క్రమంలో ఐదుగురు కొండను తవ్వుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మురళి తెలిపారు.

News February 4, 2025

ఒంగోలు: వైసీపీలో ఉండేది ఎవరు.?

image

ఒంగోలు కార్పొరేషన్ రాజకీయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు జిల్లాలో జోరుగా చర్చ సాగుతుంది. దీంతో వైసీపీలో ఉండే కార్పొరేటర్లు ఎంత మంది అనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కార్పొరేటర్లలో అత్యధికులు బాలినేనికి సన్నిహితులు కావడం గమనార్హం.

error: Content is protected !!