News March 20, 2025
పాఠశాలను తనిఖీ చేసిన MHBD అదనపు కలెక్టర్

కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ఎంపికైన పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ పరిశీలించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్ సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష జరిగే సమయాల్లో పరిసర ప్రాంతాలలో జిరాక్స్ సెంటర్లు మూసివేసి 144 సెక్షన్ విధించడం జరుగుతుందన్నారు.
Similar News
News March 21, 2025
పట్టుబడిన కీచక ప్రొఫెసర్.. వెలుగులోకి కీలక విషయాలు

విద్యార్థినులపై లైంగిక దాడి చేసి పరారీలో ఉన్న UPలోని హథ్రాస్కు చెందిన ప్రొఫెసర్ రజినీష్ కుమార్ పోలీసులకు దొరికాడు. మార్కులు వేస్తానని, ఉద్యోగాల పేరుతో అమ్మాయిలపై కొన్నేళ్లుగా అత్యాచారం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు. లైంగిక దాడి దృశ్యాలు రికార్డ్ చేయడానికి అతను కంప్యూటర్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాడన్నారు. నిందితుడికి 1996లో పెళ్లైనా పిల్లలు లేరని తెలిపారు.
News March 21, 2025
పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా!

వాతావరణంలో మార్పుల వల్ల పెద్దపల్లి జిల్లాలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు వేసవి నేపథ్యంలో ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇక 10 దాటితే ఎండ తీవ్రత పెరుగుతుంది. వ్యవసాయదారులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గడిచిన 24 గంటల్లో ముత్తారం మండల కేంద్రంలో 37.8℃ గరిష్ట ఉష్ణోగ్రతలు, జూలపల్లి 22.0℃అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
News March 21, 2025
నెల్లూరు: నిరుపేద కుటుంబం.. ఆల్ ఇండియా ర్యాంకు

ఉదయగిరి మండలం జి. చెర్లోపల్లి వడ్డిపాలెం గ్రామానికి చెందిన వెంకటయ్య, నరసమ్మ దంపతుల కుమారుడు శేఖర్ ఆల్ ఇండియా లెవెల్లో GATE ECE గ్రూపులో 425వ ర్యాంక్ సాధించారు. శేఖర్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోగా.. తల్లి కూలి పనులకు వెళ్లి శేఖర్ని చదివించింది. ఎలాంటి కోచింగ్ లేకుండానే GATE పరీక్ష రాసి తొలిప్రయత్నంలోనే జాతీయస్థాయి ర్యాంకు సాధించాడు. IITలో M.Tech చేసి మంచి జాబ్ సాధించడమే లక్ష్యమని శేఖర్ అన్నారు.