News June 26, 2024

పాఠశాలలో చేరిన SAలు.. SGTల పదోన్నతులపై ఫోకస్

image

స్కూల్ అసిస్టెంట్ సమాన స్థాయి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగియడంతో అధికారులు ఎస్జీటీ సమాన స్థాయి ఉపాధ్యాయులకు SAలుగా పదోన్నతి కల్పించడంపై దృష్టి సారించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 1,734 మంది SAలు బదిలీ ఉత్తర్వులు అందుకున్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులు మంగళవారం కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరారు. పదోన్నతులు పొందనున్న SGTలు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు.

Similar News

News June 29, 2024

నాగర్ కర్నూల్: భర్తను చంపిన భార్య

image

భర్తను భార్య కిరాతకంగా బండరాయి, కర్రతో దాడి చేసి హత్య చేసిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నట్లు సీఐ కనకయ్య తెలిపారు. శివశంకర్‌(35) హమాలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య శివలీల మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. శివశంకర్‌కు తన ప్రవర్తన మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. ఆవేశానికి గురైన శివలీల, శివశంకర్‌ తలపై బండరాయి, కర్రతో తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు

News June 29, 2024

MBNR: ‘పది’ సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలదే పైచేయి!

image

పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 5,020 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 4,238 మంది ఉత్తీర్ణులయ్యారు. 84.42 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. MBNR-70.21శాతం, GDWL-87.80 శాతం, WNPT-95.36శాతం, NGKL-93.40 శాతం, NRPT-76.73 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

News June 29, 2024

షాద్‌నగర్ ఘటనలో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి: డీకే అరుణ

image

షాద్‌నగర్ పరిధిలోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విచారణ వ్యక్తం చేశారు. పేలుడులో ఐదుగురు కార్మికులు మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. ఘటలో మృతిచెందిన, గాయపడ్డ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.