News October 10, 2025
పాఠశాలలో మత బోధనలు నిజమే: ఎంఈఓ శ్రీధర్

వర్ధన్నపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో మత బోధనలు చేసిన విషయం నిజమేనని ఎంఈఓ శ్రీధర్ నిర్ధారించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు చేరుకునే యాజమాన్యంతో విద్యార్థులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ క్రైస్తవ మతస్థుడు తరగతి గదిలో విద్యార్థులకు బోధనలు చేసిన విషయం నిజమేనని తేలిందని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి నివేదిక డీఈఓకు అందిస్తామన్నారు.
Similar News
News October 11, 2025
సిర్పూర్ (టి): పెద్దపులి దాడిలో ఆవు మృతి

ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. శుక్రవారం సిర్పూర్ (టి) మండలం నవేగాం, ఇటిక్యాల గ్రామాల్లో పెద్దపులి సంచరించిందని అటవీ అధికారులు తెలిపారు. నవేగాంలో జుంగరి శివరామ్కు చెందిన ఆవుపై దాడి చేసి చంపినట్లు వెల్లడించారు. దీంతో గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News October 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 11, 2025
అఫ్గాన్ను భారత్ టెర్రర్ బేస్గా వాడుతోంది: పాక్

భారత్-అఫ్గాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ DG అహ్మద్ షరీఫ్ ఇండియాపై దారుణమైన ఆరోపణలు చేశారు. ‘పాక్లో టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కోసం అఫ్గాన్ను భారత్ ఒక ఉగ్రవాద స్థావరంగా వాడుకుంటోంది. అఫ్గాన్లో ఇతరులకు చోటివ్వడం కేవలం పాక్కే కాదు.. సౌదీ, UAE, చైనా, US, తుర్కియే దేశాలకూ ప్రమాదమే’ అని షరీఫ్ వ్యాఖ్యానించినట్లు ‘ది డాన్’ నివేదికలో పేర్కొంది.