News January 1, 2026

పాడేరులో జిల్లా స్థాయి నూతన సంవత్సరం వేడుకలు

image

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం–2026 వేడుకలు నేడు పాడేరులో నిర్వహించనున్నారు. ఉదయం 7.30 నుంచి 10.30 గంటల వరకు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. (మనివా గ్రిల్స్ రెస్టారెంట్ ఎదురుగా) వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆహ్వానితులు హాజరుకావాలని జిల్లా యంత్రాంగం కోరింది.

Similar News

News February 4, 2026

VZM: ‘నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం’

image

ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ముఖ్యమని ఎస్పీ దామోదర్ తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే చోరీలు, ఇతర నేరాలు తగ్గుతాయని అన్నారు. నేరం జరిగినప్పుడు ఫుటేజీ ఆధారంగా కేసులు చేధించేందుకు అవకాశం ఉంటుందని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన బుధవారం పిలుపునిచ్చారు.

News February 4, 2026

రమేశ్ మాదిగ హత్య కేసులో 12 మంది అరెస్ట్

image

MRPS రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రమేశ్ మాదిగ హత్య కేసులో 12 మంది నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు. ఈ హత్యకు నిరసనగా, నిందితులను శిక్షించాలని దళిత సంఘాలు కర్నూలు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాయి. ముమ్మర దర్యాప్తు అనంతరం ముద్దాయిలను పట్టుకున్నామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు.

News February 4, 2026

క్వారీ లీజ్ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్

image

నవ్య రాజధాని అమరావతి అభివృద్ధి పనుల్లో మైన్స్, రెవెన్యూ, అటవీ, పర్యావరణ శాఖల సమన్వయం కీలకమని NTR కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన ప్రత్యేక కమిటీ సమావేశంలో క్వారీ లీజుల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు. అవసరమైన NOCలను త్వరగా జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రాజధాని పనులకు అవసరమైన గ్రావెల్ కొరత రాకుండా చూడాలని సూచించారు.