News April 11, 2025
పాడేరులో 1,03,078 పేపర్ల వాల్యుయేషన్

అల్లూరి జిల్లా కేంద్రం అయిన పాడేరులో కొత్తగా ఏర్పాటు చేసిన స్పాట్ కేంద్రంలో మొత్తం 1,03,078 పదో తరగతి పేపర్ల మూల్యాంకనం చేసినట్లు DEO బ్రహ్మాజీరావు శుక్రవారం తెలిపారు. 18,904 ఇంగ్లిష్, 16,375 మాథ్స్, 21,693 PS, 23099 BS, 23,007 సోషల్ స్టడీస్ పేపర్స్ వాల్యుయేషన్ చేశామన్నారు. మొత్తం 510 మంది టీచర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు.
Similar News
News April 18, 2025
ధరణి కారణంగా రైతులకు ఇబ్బందులు: మంత్రి

గతంలో అమల్లో ఉన్న ధరణి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వారికి ఇచ్చిన హామీ ప్రకారం 18 రాష్ట్రాల్లో ఉన్న చట్టాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని ప్రవేశపెట్టిందన్నారు. 45 రోజులు మార్పులు చేర్పులకు అవకాశం ఉందన్నారు. చట్టానికి వంద రోజుల్లో విధి విధానాలు అమలు చేసుకుందామన్నారు.
News April 18, 2025
ఎన్టీఆర్: ‘MLA సీటు త్యాగం.. పది నెలలుగా ఎదురుచూపులు’

మాజీ మంత్రి దేవినేని ఉమ 2024 ఎన్నికలలో తన సిట్టింగ్ మైలవరం స్థానాన్ని వసంత కృష్ణప్రసాద్కు ఇచ్చారు. కూటమి గెలుపు అనంతరం ఉమకు MLC, రాజ్యసభ ఎంపీ, నామినేటెడ్ పదవి ఇవ్వనున్నారని వార్తలొచ్చినా చివరికి పదవి దక్కలేదు. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు పదవులు ఇవ్వాల్సి రావడంతో ఉమకు టీడీపీ అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రానున్న రోజుల్లోనైనా ఉమ ఎదురుచూపులకు ఎండ్ కార్డు పడుతుందేమో చూడాలి.
News April 18, 2025
సిద్దిపేట: కరెంట్ షాక్తో బాలుడి మృతి

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి ఆరో తరగతి విద్యార్ధి సాయి ప్రణీత్(12) మృతి చెందిన ఘటన తోగుట మండలం తుక్కాపూర్లో చోటుచేసుకుంది. గ్రామంలోని దేవాలయంలో జరిగే ఉత్సవాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ పోల్ను అనుకోకుండా తగలడంతో సాయి ప్రణీత్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తండ్రి స్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.