News April 9, 2025
పాడేరులో 89.31శాతం వాల్యుయేషన్ పూర్తి: డీఈవో

పాడేరులో ఏర్పాటు చేసిన స్పాట్ సెంటర్లో ఇప్పటి వరకు 92,116 టెన్త్ పేపర్స్ మూల్యాంకనం చేసినట్లు DEO బ్రహ్మాజీరావు మంగళవారం తెలిపారు. ఇప్పటి వరకు 89.31శాతం వాల్యుయేషన్ పూర్తి అయ్యిందన్నారు. ఇంకా 11,016 పేపర్స్ మూల్యాంకనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ పేపర్స్ను ఈ కేంద్రంలో వాల్యుయేషన్ చేస్తున్నామని తెలిపారు.
Similar News
News April 17, 2025
ఖమ్మం: ఇద్దరు పిల్లలను నరికి తల్లి SUICIDE

హైదరాబాద్ జీడిమెట్ల PS పరిధిలో దారుణం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వివాహిత తేజ(30) గాజులరామారంలో ఉంటుంది. వేట కొడవలితో ఇద్దరు కొడుకులను నరికి, ఆనక తల్లి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో 7, 5 ఏళ్ల పిల్లలను కిరాతకంగా నరికి చంపిందని స్థానికులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.
News April 17, 2025
కర్నూలు: సీనియర్ సిటిజన్ ఐడీకి ఆన్లైన్ దరఖాస్తులు

జిల్లా వయోవృద్ధులకు సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వయో వృద్ధుల సంక్షేమశాఖ అధికారి రయిస్ ఫాతిమా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 60 ఏళ్లు పైబడిన పురుషులు, 58 ఏళ్లు పైబడిన మహిళలు సీనియర్ సిటిజన్లు అర్హులన్నారు. ఈ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్, పాసుపోర్టు సైజు ఫొటోతో వార్డు, గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News April 17, 2025
భూభారతిపై మేడ్చల్ కలెక్టర్ సమావేశం

ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గౌతం అన్నారు. కలెక్టరేట్లో భూభారతిపై తహాశీల్దార్లు, జిల్లా రెవెన్యూ అధికారులకు అవగాహన కల్పించేందుకు అదనపు కలెక్టరు విజయేంధర్ రెడ్డితో కలిసి సమావేశమయ్యారు.