News June 13, 2024

పాడేరు ఘాట్ వ్యాన్ ప్రమాదంలో బిడ్డ కోసం తల్లి సాహసం

image

పాడేరు ఘాట్‌లో సౌండ్ సిస్టం లోడుతో వెళ్తున్న వ్యాన్ బుధవారం బోల్తా కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తన బిడ్డను రక్షించుకునేందుకు ఓ తల్లి సాహసం చేసింది. వ్యాన్ కింద నలిగిపోతున్న బిడ్డకు ఏమీ కాకుండా కౌగిలిలో వదలకుండా పట్టుకుంది. దీంతో వారిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బిడ్డకు ఏమీ కాకుండ తల్లి చేసిన సాహసాన్ని చూసి పలువురు ప్రశంసిస్తున్నారు.

Similar News

News December 21, 2025

రేపు జిల్లా పోలీస్ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్

image

విశాఖపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌‌ఎస్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని చెప్పారు. నగర పౌరులు శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను ఫిర్యాదు చేయటం ద్వారా సత్వర పరిష్కారం పొందువచ్చని పేర్కొన్నారు.

News December 21, 2025

భవన శిథిలాలు రోడ్లు పక్కన పోస్తే చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

విశాఖను కాలుష్య రహిత నగరంగా చేయటానికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. క్షీణిస్తున్న గాలి నాణ్యతపై అత్యవసర చర్యలు చేపట్టాలని సూచించారు.చెత్తను కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని, చెత్తను కాల్చవద్దన్నారు. తొలగించిన భవన శిథిలాలను ఎక్కడపడితే అక్కడ పోయివద్దని,రాత్రి సమయాల్లో అలాంటి వాహనాలపై నిఘా పెట్టి వాహనాలను సీజ్ చేసి భవన యజమానిపై చర్యలు తీసుకోవాలన్నారు.

News December 21, 2025

భవన శిథిలాలు రోడ్లు పక్కన పోస్తే చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

విశాఖను కాలుష్య రహిత నగరంగా చేయటానికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. క్షీణిస్తున్న గాలి నాణ్యతపై అత్యవసర చర్యలు చేపట్టాలని సూచించారు.చెత్తను కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని, చెత్తను కాల్చవద్దన్నారు. తొలగించిన భవన శిథిలాలను ఎక్కడపడితే అక్కడ పోయివద్దని,రాత్రి సమయాల్లో అలాంటి వాహనాలపై నిఘా పెట్టి వాహనాలను సీజ్ చేసి భవన యజమానిపై చర్యలు తీసుకోవాలన్నారు.