News April 17, 2025
పాడేరు: ‘తాగునీటి సమస్యలు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు’

ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అల్లూరి జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలు గురించి కలెక్టర్ దినేష్ కుమార్ వివరించారు. జేసీ అభిషేక్ పాల్గొన్నారు.
Similar News
News April 19, 2025
పెద్దపల్లిలో అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

పెద్దపల్లి జిల్లాలో అంతర్రాష్ట్ర ATM దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు డీసీపీ కరుణాకర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దొంగలు రాజస్థాన్కు చెందిన ఇద్దరు సొంత అన్నదమ్ములుగా గుర్తించారు. గత కొద్దిరోజులుగా వస్తున్న ఫిర్యాదులపై పోలీసులు నిఘా పెంచి గాలించారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
News April 19, 2025
ములుగు: ఆ స్వామి నాభి చందనం సేవిస్తే.. సంతానం కలుగుతుంది!

తెలంగాణలోనే 2వ యాదగిరిగుట్టగా పిలుచుకునే మంగపేట మండలం మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 6వ శతాబ్దంలోని చోళ చక్రవర్తుల కాలంనాటి నుంచే ఈ ఆలయం ఉన్నట్లు చెబుతుంటారు. స్వామి వారి బొడ్డు నుంచి కారే ద్రవం(నాభి చందనం)కు ఓ ప్రత్యేకత ఉంది. ఆ ద్రవం సేవిస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. ఎంతోమందికి సంతానం కలిగిందని ఇక్కడి అర్చకులు చెబుతుంటారు.
News April 19, 2025
కూసుమంచి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

కూసుమంచిలోని హైస్కూల్ ఎదురుగా రెండు రోజుల క్రితం రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన పోచారం గ్రామానికి చెందిన ఇందుర్తి శ్రీనివాసరెడ్డి చనిపోయారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.