News March 20, 2025

పాడేరు: ‘నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యం’

image

నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యమని కలెక్టర్ దినేశ్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ నుంచి నాటుసారా నివారణపై రెవెన్యూ, అటవీశాఖ, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్రమ నాటుసారా తయారీదారులపై దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేయాలని సూచించారు. నాటుసారా నివారణకు గ్రామస్థులు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రత్యేకాధికారులను నియమిస్తామన్నారు.

Similar News

News March 21, 2025

శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు ఫ్యామిలీ

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మనవడు దేవాన్ష్ జన్మదినం సందర్భంగా ఇవాళ అన్నప్రసాద వితరణ చేయనున్నారు. మంత్రి లోకేశ్‌తో సహా కుటుంబసభ్యులంతా నిన్న రాత్రి పద్మావతి గెస్ట్ హౌజ్‌కు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ ఛైర్మన్, ఈవో స్వాగతం పలికారు. అన్నప్రసాదాలు తీసుకోవడంతో పాటు భక్తులకు వడ్డించనున్నారు.

News March 21, 2025

నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. ఈసారి కొత్త విధానం

image

TG: నేటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 5,09,403 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉ.9.30 గంటలకు పరీక్షలకు ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తొలిసారిగా 24 పేజీల బుక్ లెట్ ఇవ్వనున్నారు. ఎలాంటి అడిషనల్ పేజీలు ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. ALL THE BEST.

News March 21, 2025

అట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు: మంత్రి

image

TG: రాష్ట్రంలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలను ‘తెలంగాణ జరూర్ ఆనా’ నినాదంతో ప్రారంభించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మే10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగనుండగా 31న హైటెక్స్‌లో ముగింపు వేడుకలను నిర్వహించనున్నారు. మెుత్తంగా 21 ప్రదేశాల్లో 23థీమ్‌లతో ఈవెంట్ నిర్వహించేలా ప్రణాళికలు వేస్తున్నారు. మే7నుంచి31వరకు ఈ పోటీలు జరగనున్నాయి.

error: Content is protected !!