News March 11, 2025
పాడేరు: నేటి ఇంటర్ పరీక్షలకు 654 మంది దూరం

అల్లూరి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్ పరీక్షకు 6,468 మంది హాజరు కావాల్సి ఉండగా 6,028 మంది హాజరయ్యారు. 456 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి అప్పలరాం తెలిపారు. 8 కళాశాలల్లో జరిగిన ఒకేషనల్ పరీక్షకు 1,298 మందికి గాను 1,100మంది హాజరు కాగా..198 మంది గైర్హాజరు అయ్యారు.
Similar News
News September 17, 2025
గోదావరిఖని: గోవాకు ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీ

గోదావరిఖని ఆర్టీసీ డిపో నుంచి గోవాకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు గోదావరిఖని బస్టాండ్ నుంచి స్లీపర్ బస్ బయలుదేరుతుంది. ఈ ప్యాకేజీలో మురుడేశ్వర్, గోకర్ణ, గోవా పర్యటనలు ఉంటాయి. ఒక్కరికి ₹7,500 చొప్పున ఛార్జ్ నిర్ణయించారు. నగరానికి 28న తిరిగి చేరుకుంటారని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. రిజర్వేషన్ల కోసం 7013504982, 7382847596 నంబర్లలో సంప్రదించవచ్చు.
News September 17, 2025
NRPT: ప్రజా చైతన్యం.. ఆర్యసమాజ్ పోరాటం

నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలపై ఆర్య సమాజం గట్టిగా పోరాడింది. 1892లో హైదరాబాద్లోని సుల్తాన్ బజార్లో స్థాపించిన ఆర్య సమాజ్ శాఖ, నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించింది. 1944లో నిజాం రాష్ట్రీయ ప్రజా సమితి (NRPT) సమావేశాలు ఈ పోరాటాన్ని మరింత బలపరిచాయి. ఈ చారిత్రక సంఘటనలు సమాజంలో మార్పు కోసం ఆర్య సమాజం చేసిన అకుంఠిత కృషిని ప్రతిబింబిస్తాయి.
News September 17, 2025
KMR: జెండా ఎగరవేసిన ఎస్పీ

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆయన మాట్లాడుతూ.. ఐక్యతతోనే విజయాన్ని సాధించగలమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని పిలుపునిచ్చారు.