News April 11, 2025

పాడేరు: ‘పీఎం-జుగా అమలకు సమగ్రమైన సర్వే’

image

ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ యోజన (పీఎం-జుగా) అమలు చేయడానికి సమగ్రమైన సర్వే నిర్వహించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. పీఎం-జుగా అమలుపై శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. శుక్రవారం ఐటీడీఏలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పీఎం-జుగా సర్వే ప్రొఫార్మాలను జిల్లా అధికారులకు అందించి, సర్వే చేయాలని ఆదేశించారు. జిల్లాలో 521 గ్రామాలు కార్యక్రమం అమలుకు ఎంపిక చేశామన్నారు.

Similar News

News November 10, 2025

VKB: కళ్లముందే కదలాడుతున్నాయి

image

చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగి నేటికి వారమవుతున్నా ప్రజల మనసుల్లో ఇంకా ఆ దృశ్యాలు కదలాడుతూనే ఉన్నాయి. అయితే ఓ ప్రశ్న మాత్రం ఇంకా అందరి నోటా వినిపిస్తోంది. ఈ ప్రమాదానికి బాధ్యులు ఎవరు..? రోడ్డును బాగు చేయక వదిలేసిన రాజకీయ నాయకులా..? రోడ్డు విస్తరణకు అడ్డుగా నిలిచిన పర్యావరణ ప్రేమికులా..? రీజన్ ఏదైనా రహదారి విస్తరణ జరిగుంటే ఇలా అయ్యేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

News November 10, 2025

అంచనాలు పెంచేసిన ‘ఉస్తాద్’ టీమ్

image

పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మీసాల పిల్ల(మన శంకర వరప్రసాద్ గారు), చికిరి(పెద్ది) పాటలు హిట్టవడంతో ఇక ‘ఉస్తాద్’ అప్డేటే మిగిలిందని అభిమానులు SMలో పోస్టులు చేస్తున్నారు. దీంతో మూవీ టీమ్ స్పందించింది. ‘అదే పనిలో ఉన్నాం. మీ అంచనాలను ఎక్కువగానే పెట్టుకోండి’ అని రాసుకొచ్చింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

News November 10, 2025

14, 15 తేదీల్లో రైతు సంఘం జిల్లా మహాసభలు

image

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ జిల్లా మహాసభలు ఈ నెల 14, 15 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా, పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో జరగనున్నాయి. ఈ మహాసభకు రైతు సంఘం జిల్లా క్యాడర్ అంతా పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు ఆదివారం పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి. కృష్ణయ్య, కె. ప్రభాకర్ రెడ్డితో పాటు రాష్ట్ర ఆక్వా సంఘం నాయకులు బి. బలరాం తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు.