News September 23, 2025
పాడేరు: మ్యూటేషన్ల పనులను వేగవంతం చేయాలి

మ్యూటేషన్ల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సంతృప్తికరమైన సేవలు అందించి, పీజీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మంగళవారం పాడేరు కలెక్టరేట్ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. మ్యూటేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న మ్యూటేషన్లకు సంబంధించి ప్రణాళికలు రూపొందించి, త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News September 23, 2025
విద్యార్థులకు ఆన్లైన్ పోటీలు: నిర్మల్ డీఈవో

బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్లో వ్యాసరచన, చిత్రలేఖనం, షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో భోజన్న తెలిపారు. కాంప్లెక్స్, మండల పరిధిలో పోటీలను తొలుత నిర్వహించాలని సూచించారు. ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులను జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలకు పంపుతామన్నారు.
News September 23, 2025
మిర్యాలగూడలో భారీ చోరీ.. దొంగలు దొరికారు

మిర్యాలగూడలోని వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్లో జరిగిన భారీ చోరీ కేసును నల్గొండ పోలీసులు ఛేదించారు. ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.66.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లాలో కలకలం సృష్టించిన ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకున్నారు.
News September 23, 2025
MHBD: వివాహితను హత్య చేసిన ప్రియుడు

వివాహిత హత్యతో మహబూబాబాద్ మండలం సికింద్రాబాద్ పరిధి సొమ్ల తండాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన బోడ స్వరూప(37)కు 3 సం. నుంచి ఇంటి పక్కన ఉండే బానోత్ అనిల్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇద్దరు హైదరాబాద్లో కలిసి ఉండగా.. వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ప్రియుడు ఆవేశంలో వివాహితను హతమార్చాడు. స్వరూపకు భర్త రవి, కూతురు, కుమారుడు ఉన్నారు.