News April 4, 2025

పాడేరు: ‘రూ.456 కోట్లతో రోడ్లు అభివృద్ధి పనులు’

image

అల్లూరి జిల్లాలో మారుమూల గ్రామాలకు రహదారులు నిర్మించి, డోలీ మోతల రహితంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేశ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పాడేరులోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రూ.456 కోట్లతో రహదారుల అభివృద్ధి, కొత్త రోడ్లు నిర్మాణాలు, 26 వంతెనల నిర్మాణాలను మంజూరు చేయడం జరిగిందని స్పష్టం చేసారు.

Similar News

News February 27, 2026

లిక్కర్ స్కామ్ కేసులో కవితకు క్లీన్‌చిట్

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు భారీ ఊరట దక్కింది. సీబీఐ దాఖలు చేసిన కేసులో ఆమె పేరును కూడా రౌస్ అవెన్యూ కోర్టు డిశ్ఛార్జ్ చేసింది. దీంతో కవితకు క్లీన్‌చిట్ లభించినట్లు అయింది. కాగా ఈ కేసులో కవిత 166 రోజులు జైలు జీవితం గడిపారు. మరోవైపు ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డికి కూడా క్లీన్‌చిట్ లభించింది.

News February 27, 2026

నేటి నుంచి వీరవల్లి శ్రీ తిరుపతమ్మ, గోపయ్య తిరుణాళ్లు

image

బాపులపాడు మండలం వీరవల్లిలోని శ్రీ తిరుపతమ్మ , గోపయ్యగార్ల తిరునాళ్లు శుక్రవారం మొదలు కానున్నాయి. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు ఉదయం 10 గంటలకు అమ్మవారి కళ్యాణం చేయనున్నారు. సాయంత్రం మేళతాళాలు, కోలాటాలు, చెక్కభజనలతో గ్రామ ప్రభల మధ్య అమ్మవారి ఊరేగింపు కొనసాగుతుంది. చివరి రోజు భక్తులకు అన్నసంతర్పణ చేయనున్నారు.

News February 27, 2026

కన్నీళ్లు పెట్టుకున్న అరవింద్ కేజ్రీవాల్

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో <<19251338>>క్లీన్‌చిట్<<>> లభించడంతో అరవింద్ కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు వద్ద తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘కేజ్రీవాల్ తప్పు చేయలేదు. ఆప్ పార్టీ తప్పు చేయలేదు. మోదీ ఇప్పటికైనా తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి. మా పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించారు’ అని విమర్శించారు. కేజ్రీవాల్‌ ఇంటికి చేరుకున్న సందర్భంగా భార్య, కూతురి ఆనందం అవధులు దాటింది.