News April 4, 2025
పాడేరు: ‘రూ.456 కోట్లతో రోడ్లు అభివృద్ధి పనులు’

అల్లూరి జిల్లాలో మారుమూల గ్రామాలకు రహదారులు నిర్మించి, డోలీ మోతల రహితంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేశ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పాడేరులోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రూ.456 కోట్లతో రహదారుల అభివృద్ధి, కొత్త రోడ్లు నిర్మాణాలు, 26 వంతెనల నిర్మాణాలను మంజూరు చేయడం జరిగిందని స్పష్టం చేసారు.
Similar News
News February 28, 2026
VZM: పొట్టకూటి కోసం వెళ్తూ.. మృత్యవాత

తూ.గో. జిల్లా దేవరపల్లి(M) ఎర్నగూడెం హైవే ఫ్లైఓవర్పై శనివారం తెల్లవారుజామున లారీ పైనుంచి జారిపడి విజయనగరం జిల్లా వాసి మృతి చెందాడు. గజపతినగరం(M) పాతబగ్గానికి చెందిన పల్లి ప్రసాద్ (24) మరి కొంత మందితో కలిసి కృష్ణాజిల్లా గుడివాడలో మినప చేలు తీత కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు తెలిపారు. నిద్ర మత్తులో ఉండగా లారీ వెనక డోర్ పైనుంచి జారిపడి తలకు దెబ్బ తగిలి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
News February 28, 2026
IND-EU మధ్య మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా!

ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(FTA) కుదుర్చుకొన్న <<18973975>>భారత్-ఈయూ<<>> మరో అడుగు ముందుకేశాయి. ఈ డీల్ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఐదేళ్లపాటు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాను ఇచ్చుకునేందుకు అంగీకరించాయి. దీని ప్రకారం IND లేదా EU వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(WTO) దేశాలతో మెరుగైన డీల్ చేసుకుంటే.. దాన్ని ఈ రెండు దేశాలకూ వర్తింపజేసుకుంటాయి. కాగా India-EU ట్రేడ్ డీల్ను ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా అభివర్ణిస్తున్న విషయం తెలిసిందే.
News February 28, 2026
నెల్లూరు జిల్లాలో 33 మందికి కేంద్ర పతకాలు

నెల్లూరు జిల్లాలో 2025లో విశిష్ట సేవలందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం అతి ఉత్కృష్ట సేవ, ఉత్కృష్ట సేవా పతకాలను ప్రకటించింది. 13 మంది అతి ఉత్కృష్ట. 23 మంది ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఇందులో ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు తదితరులు ఉన్నారు.


