News April 11, 2025
పాడేరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

పాడేరు మండలం మినుములూరు రహదారి మార్గంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్పై పాడేరు వెళ్తున్న చిరు వ్యాపారిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ చోదకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు నిలబడేవని పోలీసులు చెబుతున్నారు.
Similar News
News April 18, 2025
IPL: ఆగని వర్షం.. టాస్ ఆలస్యం

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వర్షం కొనసాగుతోంది. దీంతో 7 గంటలకు పడాల్సిన టాస్ వాయిదా పడింది. మ్యాచ్ కూడా కొంత ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉంది. లేట్గా స్టార్ట్ అయినా మధ్యలో వర్షం రాకపోతే పూర్తి 40 ఓవర్ల ఆట యథావిధిగా జరుగుతుంది.
News April 18, 2025
నెల్లూరు: ఒకేసారి రూ.5వేలు పెరిగిన ధర

నెల్లూరు జిల్లాలో కొంతమేర నిమ్మ ధరలు పెరిగాయి. పొదలకూరు మార్కెట్లో లూజు బస్తా శుక్రవారం రూ.7వేల నుంచి రూ.9వేలు పలికింది. మంచు ప్రభావం తగ్గి వేసవితాపం పెరగడంతో ఢిల్లీలో మార్కెట్ ఊపందుకుంది. 15 రోజుల కిందట రూ.4,500 ఉన్న ధర ఒకేసారి రూ.5 వేలు పెరిగి రూ.9వేలకు చేరింది. దీంతో రైతులు చెట్లకు ఉన్న కాయలు జాగ్రత్తగా కోసి మార్కెట్కు తరలిస్తున్నారు. చెన్నై, బెంగళూరు, కేరళకు తరలిస్తున్నారు.
News April 18, 2025
వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడింది: విశాఖ ఎంపీ

వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడిందని విశాఖ ఎంపీ శ్రీభరత్ విమర్శించారు. శుక్రవారం విశాఖ జిల్లా టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో విశాఖలో 33 ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు తెచ్చారని, రుషికొండ ప్యాలెస్కు రూ.450కోట్లు YCPప్రభుత్వం ఖర్చుపెట్టిందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్టుకు రోడ్డు కనెక్టివిటీ, విశాఖలో TCSకు ప్రతిపాదనలు చేశామన్నారు.