News October 10, 2025
పాడేరు: ‘సూపర్ జీఎస్టీపై అందరికి అవగాహన అవసరం’

సూపర్ జీఎస్టీపై అందరికి అవగాహన అవసరమని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. సూపర్ జీఎస్టీ-2.0 అన్నివర్గాలకు ప్రయోజనకరమని అన్నారు. పాడేరు కాఫీ హౌస్లో వాణిజ్య పన్నులశాఖ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన రెండు రోజుల ప్రదర్శన, విక్రయాలను శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. అన్ని వర్గాలకు ప్రయోజనం కల్పించే విధంగా జీఎస్టీ శ్లాబులను కేంద్ర ప్రభుత్వం సవరించిందని అన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News October 11, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

✯సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే శంకర్
✯డయాలసిస్ సేవలు సకాలంలో అందించాలి: జడ్పీ చైర్పర్సన్
✯ఇరిగేషన్ అధికారులపై ఎమ్మెల్యే కూన ఆగ్రహం
✯కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే అశోక్
✯ లక్ష్మీపురంలో కుక్కల స్వైరవిహారం
✯జిల్లాలో పలుచోట్ల సూపర్ జీఎస్టీపై అవగాహన
✯పొందూరు: భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి
News October 11, 2025
అఫ్గాన్ల సపోర్ట్ ఎప్పుడూ భారత్కే: పాక్

తాము ఎన్ని త్యాగాలు చేసినా అఫ్గాన్లు మాత్రం భారత్ వైపే ఉంటారని పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ విమర్శించారు. ‘చరిత్ర చూస్తే అఫ్గానిస్థాన్ ఎప్పుడూ భారత్కు విధేయంగానే ఉంది. నిన్న, ఇవాళ, రేపు కూడా అదే జరుగుతుంది’ అని పేర్కొన్నారు. పాకిస్థాన్లో గత ప్రభుత్వాలు లక్షలాది మంది అఫ్గాన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించడాన్ని తప్పుబట్టారు. పాక్ ధాతృత్వం గుడ్ విల్గా మారలేదని అసహనం వ్యక్తం చేశారు.
News October 11, 2025
కనక దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ తాకితే?

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయి. అలాగే.. విజయవాడ కనక దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ తాకితే యుగాంతమే అని కూడా చెప్పారు. ‘అంత ఎత్తయిన కొండపైకి కృష్ణా నీరు రావడమంటే, అది ప్రకృతి ప్రకోపానికి, ప్రళయానికి సంకేతం. ఆ పెను మార్పు సంభవించినప్పుడు లోకంలో జీవరాశి నిలవడం కష్టం. ఇది యుగాంతానికి దారి తీసే భయంకరమైన దైవిక సంకేతం’ అని పండితులు చెబుతున్నారు.