News August 10, 2025

పాతబస్తీలో పెడిస్ట్రియన్ జో‌న్‌‌.. మీ కామెంట్?

image

HYD నగర సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. పాతబస్తీ ఏరియాలో పెడిస్ట్రియన్ జోన్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. దీంతో పాటు పార్కింగ్ సమస్యలకు చెక్ పెట్టాలని CM రేవంత్ రెడ్డి తాజా మీటింగ్‌లోనూ అధికారులకు సూచించారు. చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆస్పత్రి లాంటి రద్దీ ఏరియాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్‌ల కోసం కార్యాచరణ సిద్ధం చేయాలని CM ఆదేశించారు. దీనిపై మీరేమంటారు?

Similar News

News August 10, 2025

రహదారి మీద CMకు రాఖీ కట్టిన కార్పొరేటర్

image

CM రేవంత్‌కు అమీర్‌పేట రహదారి మీద INC మహిళా నేత రాఖీ కట్టారు. శనివారం రాత్రి కురిసిన వానకు మైత్రివనం సిగ్నల్ వద్ద రోడ్డు జలమయమైంది. ఈ నేపథ్యంలోనే CM ముంపు ప్రాంతాల్లో ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. మైత్రివనం సర్కిల్‌‌లో వాటర్ లాగింగ్‌‌పై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. CM ఆకస్మిక పర్యటన సమాచారం తెలుసుకొన్న కార్పొరేటర్ వనం సంగీత అక్కడికి చేరుకొని ఆయనకు రాఖీ కట్టారు.

News August 10, 2025

HYD: సీఎం రేవంత్ రెడ్డితో యువకుల సెల్ఫీలు

image

సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం అమీర్పేట డివిజన్‌లో ఆకస్మికంగా పర్యటించిన విషయం తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాలను రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిని చూడగానే పలువురు యువకులు సెల్ఫీల కోసం పోటీపడ్డారు. రేవంత్ రెడ్డి వారందరినీ కలిసి సెల్ఫీలు ఇచ్చారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

News August 10, 2025

BREAKING: KPHBలో కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

image

KPHB PS పరిధి వసంత్‌నగర్‌లో ఆదివారం విషాదం నెలకొంది. పోలీసుల వివరాలు.. 14 ఏళ్ల బాలుడు విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెందాడు. ఇంటి ప్రాంగణంలో బంధువుతో కలిసి విజయ్ కార్తీక్ షటిల్‌ ఆడుతుండగా కాక్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ మీద పడింది. దాన్ని తీసేందుకు ప్రయత్నించగా కరెంట్‌ షాక్‌ తగిలింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. KPHB పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.