News April 5, 2025

పాన్‌గల్: చెరువులో మృతదేహం లభ్యం

image

ఓ 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మండల కేంద్రంలోని పొల్కి చెరువులో లభ్యమైన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. ఈ వ్యక్తి మూడు రోజుల క్రితం చనిపోయి ఉంటాడు. ఆయన చనిపోయిన స్థలంలో చెప్పులు, శాలువా, కల్లు ప్యాకెట్ కనిపించాయి. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో ఘటనను పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News September 17, 2025

అమరవీరులకు నివాళులర్పించిన సీఎం

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహిస్తున్న ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించారు. పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి గన్‌పార్క్‌లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. వారి త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. మరోవైపు ఖమ్మంలో జరిగిన వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

News September 17, 2025

ADB: రాంజీ గోండ్.. అడవిలో అడుగులేసిన విప్లవం

image

బ్రిటిష్, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన వీరుడు రాంజీ గోండ్. ఆయన 1857 భారత స్వాతంత్ర్య సంగ్రామం కంటే ముందే నిర్మల్, ఆదిలాబాద్ అటవీ ప్రాంతాల్లో గిరిజనులను సమీకరించి, స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అటవీ హక్కులను కాలరాస్తున్న పాలకులకు వ్యతిరేకంగా ఆయన గెరిల్లా యుద్ధం నడిపారు. ​1860లో బ్రిటిష్ సైన్యాలు రాంజీ గోండ్, ఆయనతో పాటు దాదాపు 1000 మంది అనుచరులను పట్టుకొని నిర్మల్‌లోని ఒక మర్రిచెట్టుకు ఉరితీశారు.

News September 17, 2025

నిజాం హింసలకు సాక్ష్యం రాయికల్ ఠాణా

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్‌లో ఉన్న పాత పోలీస్ ఠాణా, నిజాం కాలంలో జరిగిన హింసలకు నిలువెత్తు సాక్ష్యం. దొరలు, రజాకార్ల చిత్రహింసలకు ఈ భవనం వేదికగా నిలిచింది. ఇనుప చువ్వల గదులు, ఇనుప మంచాలతో రూపొందించిన ఈ బందీఖానాలో పోరాట యోధులను చిత్రవధ చేశారు. ఈ భవనంపై ప్రజలు అనేకసార్లు దాడులు చేసి నిజాంను ఎదిరించారు. నేటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఈ భవనం నాటి చరిత్రకు గుర్తుగా నిలుస్తోంది.