News August 20, 2025
పాపన్నపేట: ‘నడవలేనని’ కళలకు జీవం పోస్తూ ముందడుగు..

తాను నడవలేనని బాధపడలేదు.. కనుమరుగవుతున్న కళలకు జీవం పొసేందుకు ముందడుగు వేశాడు ఓ దివ్యాంగుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రెండు పీజీలు చదివాడు. మెదక్ జిల్లా కుర్తివాడ గ్రామానికి చెందిన దేవయ్య.. గ్రామ, మండల విద్యార్థులకు జడకోప్పు, కోలాటం, యోగ్చాప్, చెక్కభజనలో శిక్షణ ఇస్తున్నాడు. వీటికి అవసరమయ్యే సామగ్రిని అతడే కొనుగోలు చేసి సమాజ సేవలో తన వంతుగా సామజిక బాధ్యత వహిస్తున్నారు .
Similar News
News August 20, 2025
MDK: ‘గ్రామాల్లో కొలవుదీరనున్న గణనాథులు’

భూలోకానికి వస్తున్న గణనాథులు నవరాత్రులు పూజలు అందుకొనున్నారు. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇప్పటికే గణపతి మండపాలను నిర్మాణం చేస్తున్నారు. ఆగస్టు 27 నుంచి వినాయక చవితి ఉన్నందున పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చందాలు, మండప నిర్మాణాల పనుల్లో నిమగ్నమైపోయారు.
News August 19, 2025
ఫోటోగ్రాఫర్లను సత్కరించిన మెదక్ కలెక్టర్

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా కలెక్టరేట్ రాహుల్ రాజ్ ఫోటోగ్రాఫర్లను సత్కరించారు. ఫోటోగ్రాఫర్గా విధులు నిర్వహిస్తున్న ప్రదీప్ను సన్మానించి మెమొంటో అందజేసి అభినందించారు. ఫోటోగ్రాఫర్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక చిత్రం ఎన్నో పదాలు, ఎన్నో అర్థాలు తెలుపుతుందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాలంటే ఫోటోలు ముఖ్యమన్నారు. డీపీఆర్ఓ రామచంద్ర రాజు ఉన్నారు.
News August 19, 2025
ఘనపూర్ ఆనకట్ట సందర్శించిన మెదక్ ఎస్పీ

మంజీరా నది ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ఘనపూర్ ఆనకట్ట ప్రాంతాన్ని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సందర్శించారు. అదేవిధంగా వన దుర్గ మాత ఆలయ ముందు ప్రవహిస్తున్న మంజీరా నీటి ఉద్దృతిని పరిశీలించారు. నది వద్ద నీటి మట్టం, ప్రవాహ వేగం, సేఫ్టీ బారికేడ్లు, రక్షణ గురించి తెలుసుకున్నారు. ఆలాగే పేరూరు ఎల్లాపూర్ బ్రిడ్జిని పరిశీలించారు. సింగూర్ గేట్లు ఎత్తడంతో ప్రవాహం కొనసాగుతుంది.