News March 28, 2025

‘పాపికొండల నుంచి ధవళేశ్వరం వరకు పర్యాటకంగా అభివృద్ధి’ 

image

పాపికొండల నుండి ధవళేశ్వరం వరకు పర్యాటకంగా హోటల్స్ ఏర్పాటుచేయడం, పోలవరం ప్రాజెక్ట్ వద్ద ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు, పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. బట్రస్ డ్యాం పూర్తికి రూ.82 కోట్ల ఖర్చు అవుతాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 886 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని సీఎంకి వివరించారు.

Similar News

News November 13, 2025

SSC ఫీజు గడువు NOV 20 వరకు పొడిగింపు

image

TG: టెన్త్ పరీక్షల ఫీజు గడువును నవంబర్ 20 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. నవంబర్ 21 నుంచి 29 వరకు ₹50, డిసెంబర్ 2 నుంచి 11 వరకు ₹200, 15 నుంచి 29 వరకు ₹500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. రెగ్యులర్, ఫెయిల్ అభ్యర్థులు 2026 మార్చిలో జరిగే ఈ పరీక్షలకు ఫీజు చెల్లించాలంది. గడువు లోపు రూ.125 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.

News November 13, 2025

NIRCAలో 27 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

రాజమండ్రిలోని ICAR- NIRCAలో 27 పోస్టులకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి M.Tech, MSc(అగ్రోనమీ), బీటెక్, BSc, MSc( అగ్రికల్చర్/లైఫ్ సైన్స్/అగ్రికల్చర్ డిప్లొమా, మాలిక్యులార్ బయాలజీ/ బయోటెక్నాలజీ/జెనిటిక్స్/లైఫ్ సైన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 21-45ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: nirca.org.in/

News November 13, 2025

ములుగు: కొనుగోలు కేంద్రాల్లో 3802 మెట్రిక్ టన్నుల ధాన్యం

image

జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో నేటివరకు 3802.320 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ దివాకర్ టిఎస్ వెల్లడించారు. ఇందులో 17% తేమతో 1629.760 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి, 1519 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు రవాణా చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో 110.760 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉన్నట్లు తెలిపారు. రూ.0.39 కోట్లు రైతులకు చెల్లించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.