News February 24, 2025

పారదర్శకంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు: కలెక్టర్

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఎమ్మెల్సీ పోలింగ్ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పీఓలు, ఏపీవోలు శిక్షణ తరగతులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 27న చేపట్టే పోలింగ్ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆకళింపు చేసుకొని ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

Similar News

News February 24, 2025

ప్రతి మహిళ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి: కలెక్టర్ 

image

ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అందుకు తప్పనిసరిగా, బాధ్యతగా డబ్బును పొదుపు చేసి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. ఆర్బీఐ వారోత్సవాల్లో భాగంగా ఆర్థిక క్రమశిక్షణ వారోత్సవాలను నిర్వస్తున్నారు. కలెక్టరేట్‌లో  వారోత్సవాల పోస్టర్లను అధికారులతో కలిసి కలెక్టర్ విడుదల చేశారు. ఈ వారోత్సవాలు ఈ నెల 24 నుంచి 28 వరకు మహిళల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News February 24, 2025

ఎనుమాముల మార్కెట్‌‌కు తరలొచ్చిన మిర్చి

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు పెద్ద ఎత్తున మిర్చి బస్తాలు వచ్చాయి. సుమారు 90 వేల బస్తాలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరంలో అత్యధిక బస్తాలు ఈరోజే వచ్చాయన్నారు. మిర్చి యార్డ్ మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోయింది. సాధ్యమైనంత తక్కువ సమయంలో కాంటాలు పెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు.

News February 24, 2025

WGL: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

image

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో వరంగల్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు, హనుమకొండ జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.

error: Content is protected !!