News December 18, 2025
పారదర్శక సేవలకు ‘ఈ-ఆఫీస్’ కీలకం: జేసీ నిశాంతి

ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకమైన, వేగవంతమైన సేవలందించేందుకు ‘ఈ-ఆఫీస్’ విధానం ఎంతో కీలకమని జేసీ నిశాంతి పేర్కొన్నారు. గురువారం అమలాపురం కలెక్టరేట్లో రెవెన్యూ సిబ్బందికి ఈ-ఆఫీస్ నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఫైళ్ల కదలిక, సమాచార నమోదులో అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అంశాన్ని ఆన్లైన్లో పొందుపరచడం ద్వారా జవాబుదారీతనం పెరుగుతుందని ఆమె సూచించారు.
Similar News
News December 20, 2025
పెరవలిలో జలధార స్కీమ్కు పవన్ నేడు శంకుస్థాపన

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో రూ.3,050 కోట్లతో చేపట్టనున్న ‘అమరజీవి జలధార’ పనులకు శనివారం పెరవలిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కోనసీమ, కాకినాడ, ఏలూరు సహా 23 నియోజకవర్గాల్లోని 68 లక్షల మందికి తాగునీరు సరఫరా కానుంది. పశ్చిమ గోదావరికి రూ. 1,400 కోట్లు, తూర్పు గోదావరికి రూ.1,650 కోట్లు కేటాయించి ఈ భారీ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్వహిస్తోంది.
News December 20, 2025
కలుపు మందుల పిచికారీ – ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఏ పంటకు సిఫార్సు చేసిన కలుపు మందులను ఆ పంటలో మాత్రమే సరైన మోతాదులో ఫ్లాట్ ప్యాన్ లేదా ఫ్లడ్ జెట్ నాజిల్ను ఉపయోగించి పిచికారీ చేయాలి. కలుపు మందులను ఇతర రసాయనాలతో (కీటక/శిలింద్రనాశినులు/పోషకాలు) కలిపి ఉపయోగిస్తే కలుపు మందుల సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. పంట మొలకెత్తాక ఉపయోగించే కలుపు మందులను.. కలుపు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారి చేసి సమర్థవంతంగా అరికట్టవచ్చు.
News December 20, 2025
స్వామికి కావాలసింది నిర్మలమైన భక్తి మార్గమే..

శ్రీనివాసుడికి అన్నమయ్య సంకీర్తనలంటే ఎంత ఇష్టమో కురువరనంబి మట్టి పూల పూజ కూడా అంతే ఇష్టం. అలాగే ముస్లిం రాకుమారి బీబీ నాంచారిని మన్నించి తన హృదయంలో స్థానమిచ్చారు. మత సామరస్యాన్ని చాటారు. భగవంతుడి దృష్టిలో కులమతాలు, పేద ధనిక భేదాలు లేవు. ఆయన ఆశించేది ఆడంబరమైన పూజలు కాదు. కేవలం నిర్మలమైన భక్తిని మాత్రమే. మనం కూడా సాటి మనుషులను సమానంగా గౌరవించాలి. హృదయం శుద్ధిగా ఉంటేనే మనం చేసే పనికి విలువ ఉంటుంది.


