News March 28, 2025
పారిశ్రామికవేత్తలతో విశాఖ కలెక్టర్ మీటింగ్

పారిశ్రామికవేత్తలతో విశాఖ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ & ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ పలు అంశాలను పారిశ్రామికవేత్తలు, అధికారులతో చర్చించారు. ఇరువురి సమన్వయంతో పరిశ్రమలు అభివృద్ధి చెందాలని అయన కోరారు.
Similar News
News March 31, 2025
విశాఖలో ఐదేళ్ల బాలిక పట్ల పీటీ అసభ్యకర ప్రవర్తన

విశాఖలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మాస్టారే చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మధురవాడ పరిధిలో జరిగింది. వాంబే కాలనీలోని ఓ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పీటీగా పనిచేస్తున్న రామచంద్రరావు ఐదేళ్ల చిన్నారి పట్ల అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆ చిన్నారి భయపడి తల్లిదండ్రులకు, టీచర్లకు చెప్పింది. వెంటనే వీరు పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పీటీని సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
News March 31, 2025
విశాఖ: మహిళను నిండా ముంచిన రాంగ్ కాల్

శ్రీకాళహస్తికి చెందిన B.అక్షయ్ విశాఖకు చెందిన మహిళ(35)కు రాంగ్ కాల్ ద్వారా పరిచయమయ్యాడు. ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతంగా మెసేజ్లు చేశాడు. కొంతకాలం తర్వాత మెసేజ్లు ఆమె భర్తకు పంపిస్తానని బ్లాక్మెయిల్ చేసి రూ.10లక్షలు దోచేశాడు. ఆమెపై లైంగిక దాడి చేసి ఆ దృశ్యాలను రికార్డ్ చేసి వేధించాడు. చివరకు మహిళ భర్త సాయంతో త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్కు తరలించారు.
News March 31, 2025
విశాఖ: యువకుడిపై కోపంతో బైక్లకు నిప్పు పెట్టిన యువతి

విశాఖలోని సింగ్ హోటల్ జంక్షన్ సమీపంలో ఉన్న అపార్ట్మెంట్ సెల్లార్లో శుక్రవారం అర్ధరాత్రి 18 బైకులు దగ్ధమైన విషయం తెలిసిందే. అయితే ఓ యువతి ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ వ్యక్తితో విభేదాల కారణంగా అతని బైక్కు నిప్పు పెట్టగా ఆ మంటలు మిగతా బైక్లకు కూడా అంటుకుని దగ్ధమయ్యాయి. సదరు మహిళ ఆ యువకుడిని గతంలో ప్రేమించిందని అతడికి వేరొకరితో పెళ్లి కావడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.