News September 24, 2024
పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి: మంత్రి పొన్నం

హుస్నాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా అక్కన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న TGIIC ఇండస్ట్రియల్ పార్కులో ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో TGIIC అధికారులు, పారిశ్రామికవేత్తలు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
Similar News
News January 8, 2026
మెదక్: తీవ్ర విషాదం.. బురదలో రైతు మృతి

కౌడిపల్లి మండలంలో మర్రి చెట్టు తండాలో పొలంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు బురదలో పడి గిరిజన రైతు మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మర్రి చెట్టు తండా చెందిన కాట్రోత్ దినాకర్(28) తన పొలంలో వరి నాటు కోసం పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు జారి బురదలో పడిపోయాడు. స్థానిక రైతులు చూసి దినాకర్ను లేపి చూడగా, అప్పటికే చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
News January 8, 2026
గ్రామాభివృద్ధిలో కార్యదర్శులదే కీలక పాత్ర: కలెక్టర్

గ్రామాల ప్రగతిలో పంచాయతీ కార్యదర్శులు క్రియాశీలకంగా వ్యవహరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థిక క్రమశిక్షణతో పంచాయతీ నిధులను వినియోగించి అభివృద్ధి సాధించాలన్నారు. పన్నుల వసూళ్లలో వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని, ఈనెల 8 నుంచి 11 వరకు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News January 8, 2026
గ్రామాభివృద్ధిలో కార్యదర్శులదే కీలక పాత్ర: కలెక్టర్

గ్రామాల ప్రగతిలో పంచాయతీ కార్యదర్శులు క్రియాశీలకంగా వ్యవహరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థిక క్రమశిక్షణతో పంచాయతీ నిధులను వినియోగించి అభివృద్ధి సాధించాలన్నారు. పన్నుల వసూళ్లలో వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని, ఈనెల 8 నుంచి 11 వరకు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


