News February 14, 2026
పారిశ్రామికవేత్త దిశగా అడుగులేద్దాం: కలెక్టర్

ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు సత్వర అనుమతులు జారీచేస్తూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తితో అడుగులేద్దామని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. శనివారం గుంటుపల్లిలోని రైజ్ కేంద్రంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి విశేష కృషిచేస్తోందని పేర్కొన్నారు.
Similar News
News February 21, 2026
ధర్మపురి: ‘బ్రహ్మోత్సవాలు జిల్లాకు ప్రతిష్ఠాత్మకం’

ధర్మపురిలో జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జిల్లాకు ప్రతిష్ఠాత్మకమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఈసారి భక్తుల రద్దీ గతేడాదితో పోలిస్తే ఎక్కువగా ఉండే అవకాశముందని అంచనా వేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, క్యూలైన్ల నిర్వహణ పక్కాగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్నదాన కేంద్రాలు, సూచిక బోర్డులు, చలువ పందిర్లు ఏర్పాటు చేయాలన్నారు.
News February 21, 2026
పనికిరాని వస్తువులకు నిత్యావసరాలు.. సీఎం ప్రకటన

AP: ప్రతి మండలానికి ఒక స్వచ్ఛ రథం ఏర్పాటు చేస్తున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. ‘‘ఇవి వారానికోసారి గ్రామానికి వస్తాయి. ఇళ్లలో పనికిరాని వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసర వస్తువులు ఇస్తారు. వచ్చేనెల కల్లా అన్ని పంచాయతీల్లో 100% ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తాం. రాజమండ్రి, KNL, KDP, నెల్లూరులో రూ.1,254CRతో PPP విధానంలో ‘వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల’ను మార్చి 15కల్లా వినియోగంలోకి తెస్తాం’’ అని తెలిపారు.
News February 21, 2026
సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలి: కలెక్టర్

తూ.గో జిల్లాలోని గ్రామపంచాయితీల పరిధిలో ఇంటి పన్నులు, పన్నేతర బకాయిలను సకాలంలో చెల్లించి గ్రామాల అభివృద్ధికి ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. జిల్లాలోని 342 గ్రామ పంచాయితీల్లో ప్రస్తుతం ఇంటి పన్నులు, పన్నేతరముల బకాయిలు రూ.125.11 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు రూ.54.00 కోట్లు వసూలైనట్లు వెల్లడించారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా బకాయిలు చెల్లించాలన్నారు.


