News December 24, 2025
పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక చొరవ చూపాలి: కలెక్టర్

జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం పెదమిరంలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయ, ఆక్వా రంగాలు ఆశాజనకంగా ఉన్నాయని, అదే స్థాయిలో పరిశ్రమలు వృద్ధి చెందాలన్నారు. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు.
Similar News
News December 26, 2025
నరసాపురం: విద్యుత్ షాక్తో యువకుడి మృతి

నరసాపురం మండలంలోని సీతారామపురం సౌత్ గ్రామంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లలో భాగంగా మైక్ సెట్ కడుతూ జెట్టిపాలెం గ్రామానికి చెందిన శీలం అభిరామ్ (19) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించాడు. చెట్టుపై మైక్ అమర్చుతుండగా సమీపంలోని 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News December 25, 2025
ఆడుకోమని వదిలిన తండ్రి, కొద్దిసేపటికే విగత జీవిగా కొడుకు

పార్కులో తన కొడుకుని ఆడుకోమని వదిలి వెళ్లిన కొద్దిసేపటికి చెరువులో పడి విగత జీవిగా మారిన ఘటన గురువారం పెనుగొండలో చోటుచేసుకుంది. ఇరగవరం మండలం ఆర్.కండ్రిక గ్రామానికి చెందిన జొన్నల ధనరాజు పెనుగొండలో బేకరీ నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం కుమారుడు ఈశ్వర్(5) తీసుకొని బేకరీకి వచ్చిన ధనరాజు కొద్దిసేపు పార్కులో ఆడుకోమని వదిలిపెట్టి వెళ్లాడు. బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు.
News December 25, 2025
ప.గో: ఆటవిడుపు విషాదాంతం.. నీటిలో విగతజీవిగా బాలుడు

పెనుగొండలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని పార్కులో గురువారం మధ్యాహ్నం ఆడుకుంటూ అదృశ్యమైన పదేళ్ల బాలుడు.. రాత్రికి సమీపంలోని చెరువులో విగతజీవిగా లభ్యమయ్యాడు. బాలుడి ఆచూకీ కోసం గాలించిన స్థానికులు, చెరువులో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.


