News May 9, 2024
పారిస్ ఒలింపిక్స్కు నిజామాబాదీ
విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్లో జరగనుంది. తమ సత్తా చాటేందుకు భారత క్రీడాకారులు తుది సన్నాహాల్లో ఉన్నారు. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన బాక్సర్ నిఖత్ జరీన్ ఒలంపిక్స్కు అర్హత సాధించారు. నిఖత్తో పాటు ప్రీతి పవార్, పర్వీన్ హుడా, లవ్లీనా బోర్గోహైన్ పారిస్ ఒలింపిక్స్కు ఎంపికయ్యారు. ఇక దేశం మొత్తం నిఖత్ జరీన్ బంగారం లాంటి ప్రదర్శన చేస్తుందని ఎదురు చూస్తోంది.
Similar News
News October 1, 2024
NZB: GREAT.. అప్పుడు సర్పంచ్గా.. ఇప్పుడు ఉపాధ్యాయుడిగా..!
చదువుకు వయసుతో నిమిత్తం లేదని నిరూపించాడు. రాజకీయంలో జిల్లాస్థాయిలో తనదైన ముద్ర వేసుకొని ఇప్పుడు డీఎస్సీలో మంచి ర్యాంకు సాధించి మన్ననలు పొందుతున్నాడు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో బీఈడీ పూర్తి చేసిన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మాజీ సర్పంచ్(2013) నంద అనిల్ నిన్న విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో జిల్లా స్థాయిలో 7వ ర్యాంకు సాధించాడు. సాంఘిక శాస్త్రం విభాగంలో స్కూల్ అసిస్టెంట్గా ఎంపిక కానున్నాడు.
News October 1, 2024
ప్రమాదవశాత్తు పోచారం కెనాల్లో పడి యువకుడి మృతి
నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట గ్రామానికి చెందిన గోరుకుల లక్ష్మణ్ (23) ప్రమాదవశాత్తు పోచారం ప్రధాన కాలువలో కాలుజారి ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం లక్ష్మణ్ పోచారం ప్రధాన కాలువలో స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. కాగా సోమవారం సాయంత్రం పోచారం ప్రధాన కాల్వలోశవమై కనిపించినట్లు ఎస్ఐ తెలిపారు.
News October 1, 2024
నిజామాబాద్ జిల్లా పీఈటీ టాపర్గా రాకేశ్ రెడ్డి
సోమవారం వెలువడిన డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామానికి చెందిన ఏరా రాకేశ్ రెడ్డి జిల్లాలో పీఈటీ లో 61.50 మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు. దీంతో అతనిని తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు, యువకులు అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ జిల్లా మొదటి ర్యాంకు సంపాదించడంతో గ్రామస్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.