News October 8, 2024
‘పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయిలో కృషి చేయాలి’

పార్టీ బలోపేతానికి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పూర్తి స్థాయిలో కృషి చేయాలని ఆ జిల్లాల వైసీపీ అధ్యక్షులు ఎస్సీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి సూచించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో నాయకులతో సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలన్నారు. కార్యక్రమంలో ఆలూరు, మంత్రాలయం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Similar News
News October 6, 2025
మట్టి మిద్దె కూలి ఐదేళ్ల బాలిక మృతి

మంత్రాలయం మండలం మాధవరంలో విషాదం చోటు చేసుకుంది. పాత మట్టి మిద్దె ఇల్లు అకస్మాత్తుగా కూలిపోవడంతో ఐదేళ్ల బాలిక లలిత సోమవారం మృతిచెందింది. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యుల్లో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు మట్టి గడ్డలను తొలగించి వారిని రక్షించారు. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
News October 6, 2025
కర్నూలు టీచర్లకు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు

విద్యారంగంలో విశిష్ట సేవలందించిన కర్నూలు బి.క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు వైవీ రామకృష్ణ, ఎన్.విజయశేఖర్కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేశారు. ప్రపంచ అధ్యాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కర్నూలు సెంట్రల్ లైబ్రరీ సమావేశ మందిరంలో NHR SJC India–Global, UCP & LRF సంయుక్త ఆధ్వర్యంలో లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు అందజేశారు.
News October 5, 2025
సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్పై పోటీలు: డీఈవో

ఈనెల 7న జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ అంశంపై వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ శనివారం తెలిపారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పోటీలు మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు. వివరాలకు కర్నూల్–II సర్కిల్ (9000724191)తో సమన్వయం చేసుకోవాలని సూచించారు.