News May 12, 2024

పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: ఎస్పీ చందనా దీప్తి

image

NLG:ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.జిల్లాలో శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు,9 మంది డిస్పీలు,37 మంది సీఐలు,84 మంది యస్.ఐలతో కలిపి మొత్తం 3000 మంది సిబ్బంది, 7 కంపెనీల కేంద్ర బలగాలు ఏర్పాటు చేయడం జరిగింది.వీటితో పాటు 5 ప్లాటున్ల TSSP సిబ్బంది,పెట్రోలింగ్ పార్టీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Similar News

News February 21, 2026

మునుగోడు: యజమాని మృతి.. శ్మశానం వద్దే వేచిచూస్తున్న కుక్క!

image

మునుగోడు మండలం కిష్టాపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన మనుషుల మధ్య బంధాలకంటే మూగజీవాల విశ్వాసం గొప్పదని మరోసారి నిరూపించింది. తనను ప్రాణప్రదంగా చూసుకున్న యజమాని పార్వతమ్మ మరణాన్ని ఆ కుక్క తట్టుకోలేకపోయింది. అంత్యక్రియలు ముగిసినా, మండుటెండలో శ్మశానం వద్దే ఉండిపోవడం ఆ మూగజీవికి ఉన్న అనురాగానికి నిదర్శనం. ఈ హృదయ విదారక దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.

News February 21, 2026

నల్గొండ: పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: కలెక్టర్

image

జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి సంపదను వినియోగించుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఇందుకోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించి, అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.

News February 21, 2026

నల్గొండ: పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: కలెక్టర్

image

జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి సంపదను వినియోగించుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఇందుకోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించి, అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.