News March 24, 2025

పార్వతీపురంలో యువతకు పీఎం ఇంటర్న్‌షిప్: కలెక్టర్

image

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ కోరారు. కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వరకు గడువు ఉందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో, బీటెక్ ఉత్తీర్ణులైన వారు దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ 500 లకు పైగా ప్రముఖ పరిశ్రమలలో ఇంటర్న్‌షిప్ పొందవచ్చని సూచించారు.

Similar News

News November 5, 2025

భారత జట్టు ప్రకటన.. పంత్ రీఎంట్రీ

image

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు BCCI జట్టును ప్రకటించింది. పంత్, అక్షర్ జట్టులోకి వచ్చారు.
✒ టెస్ట్ టీమ్: గిల్(C), పంత్ (VC), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, పడిక్కల్, జురెల్, జడేజా, సుందర్, బుమ్రా, అక్షర్‌, నితీశ్, సిరాజ్, ఆకాశ్, కుల్దీప్

✒ ODI IND-A టీమ్: తిలక్‌(C), రుతురాజ్‌(VC), అభిషేక్‌, పరాగ్‌, ఇషాన్‌, బదోని, నిషాంత్‌, V నిగమ్‌, M సుతార్‌, హర్షిత్‌, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్, ఖలీల్, ప్రభ్‌సిమ్రాన్

News November 5, 2025

శ్రీకాకుళం: ‘ప్రతి 3నెలలకు ఒకసారి సమావేశం’

image

జిల్లాను అభివృద్ధిబాటలో నడిపించేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని ఇన్‌ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం ZP సమావేశ మందిరంలో బుధవారం జరిగిన జిల్లా సమీక్షలో అయన పాల్గొన్నారు. వ్యవసాయం, ఉపాధి కల్పన,పరిశ్రమలు,పారిశుద్ధ్యం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర, రాష్ట్రస్థాయిలో చర్చించవలసిన అంశాలపై ప్రతి 3నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలన్నారు. జిల్లా MLAలు పాల్గొన్నారు.

News November 5, 2025

‘ఏటిమొగ-ఎదురుమొండి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తాం’

image

ఏటిమొగ-ఎదురుమొండి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని డీసీఎం పవన్ అన్నారు. బుధవారం ఆయన ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, ఇతర అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఏటిమొగ-ఎదురుమొండి బ్రిడ్జి నిర్మాణానికి రూ.109 కోట్ల నాబార్డు నిధులు మంజూరయ్యాయన్న పవన్.. అలైన్‌మెంట్‌లో మార్పుల కారణంగా మరో రూ.60 కోట్ల వ్యయం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారన్నారు.