News June 5, 2024

పార్వతీపురంలో 30 ఏళ్లుగా ఒకే సెంటిమెంట్

image

పార్వతీపురంలో 30 ఏళ్లుగా ఒకసారి గెలిచిన వారు మరోసారి ఎమ్మెల్యేగా గెలవలేకపోతున్నారు. 1994 నుంచి 2019 ఎన్నికల వరకు ఇదే కొనసాగింది. 2009లో ఈ స్థానం ఎస్టీలకు కేటాయించగా.. విజయరామరాజు పాతపట్నంకి మారడంతో సవరపు జయమణి గెలిచారు. 2014లో జయమణి ఎన్నికలకు దూరంగా ఉండగా.. చిరంజీవులు గెలిచారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గెలుపుపై ధీమాగా ఉన్నప్పటికీ బోనెల విజయ్ చంద్ర 20వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.

Similar News

News November 11, 2025

పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలి: సీఎం చంద్రబాబు

image

వంగర మండలంలోని అరసాడలో రూ.102 కోట్లతో నిర్మించనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌కి ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వర్చువల్‌గా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పెట్టుబడులకు ఆకర్షితులు కాకుండా పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలని పిలుపునిచ్చారు. యువ పారిశ్రామికవేత్తలు మట్టిలో మాణిక్యాలు అని, ప్రభుత్వ అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని ఆకాంక్షించారు.

News November 11, 2025

VZM: సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలకు అప్లై చేశారా?

image

సఫాయి కర్మచారి యువతకు 3 సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు సబ్సిడీపై ఇవ్వనున్నారు.
➤యూనిట్ విలువ: రూ.31,67,326
➤సబ్సిడీ: రూ.14,16,831
➤రుణ మొత్తం: రూ17,50,495, వడ్డీ రేటు: 6%
➤చెల్లింపు కాలం: 72 నెలలు (ప్రతి నెల రూ.33,064 వాయిదా)
➤గ్రూప్: 5 మంది అభ్యర్థులు ఉండాలి
➤అప్లై చేసే స్థలం: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ, మర్రి చెన్నారెడ్డి భవనం, కంటోన్మెంట్, విజయనగరం
➤చివరి తేదీ: 20-11-2025

News November 11, 2025

గృహలబ్ధిదారుల వివరాలు నమోదు చేయండి: DRO

image

గృహాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను సర్వే చేసి అర్హత ఉన్న వారి వివరాలను యాప్‌లో నమోదు చేయాలని DRO శ్రీనివాసమూర్తి సోమవారం ఆదేశించారు. నవంబర్ 30 వరకు ప్రభుత్వం సర్వేకు సమయం ఇచ్చిందని, లబ్ధిదారుల సర్వే పూర్తి చేసి అప్లోడ్ చేయాలని తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు సచివాలయాల తనిఖీ చేసి ప్రొఫార్మాలో వివరాలను నమోదు చేసి సమర్పించాలని సూచించారు.