News January 30, 2025
పార్వతీపురం అదనపు ఎస్పీగా ఎల్.నాగేశ్వరి

పార్వతీపురం అదనపు ఎస్పీగా ఎల్.నాగేశ్వరీ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు అదనపు ఎస్పీగా విధులు నిర్వహించిన డాక్టర్ దిలీప్ కిరణ్ ఏసీబీకి బదిలీపై వెళ్లనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన నుంచి నేటి వరకు అదనపు ఎస్పీగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు.
Similar News
News February 24, 2026
ఆదిలాబాద్: లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి

జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్ కేసులు ఎక్కువ పరిష్కరించేలా దృష్టి పెట్టాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే.ప్రభాకర్ రావు సూచించారు. జాతీయ లోక్ అదాలత్ ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు హల్లో మంగళవారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. గత లోక్ అదాలత్ కంటే ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు.
News February 24, 2026
ఆదిలాబాద్: కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ పాలన అధికారులు

ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో గ్రామ పాలన అధికారులు (జీపీఓలు) కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్యామల దేవి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జీపీఓ, ఆర్ఐ యాప్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గతంలో వీఆర్ఓలు, వీఆర్ఏలుగా సేవలందించిన వారిని గ్రామ పాలన అధికారులుగా నియమించి గ్రామ స్థాయిలో జరిగే అంశాలను ప్రభుత్వానికి అందజేస్తూన్నట్లు తెలిపారు.
News February 24, 2026
ఇంగ్లండ్తో పోరు.. పాక్ స్కోరు ఎంతంటే..?

T20 WC సూపర్-8లో ఇంగ్లండ్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో పాక్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 164-9 పరుగులు చేసింది. ఓపెనర్ ఫర్హాన్(63) రాణించగా, బాబర్ ఆజమ్(25), ఫఖర్ జమాన్(25) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డాసన్ 3, ఓవర్టన్, ఆర్చర్ తలో 2, రషీద్ ఒక వికెట్ తీశారు.


