News February 7, 2026

పార్వతీపురం: ఉగాది లోపు లక్ష్యాన్ని పూర్తి చేయాలి

image

ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద మంజూరైన ఇళ్లను ఉగాది పండుగ లోపు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన గృహ నిర్మాణాల్లో సంబంధిత మండలాల్లో పెండింగ్‌లో ఉన్న 1500 ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.

Similar News

News February 16, 2026

ఎక్ససైజ్ చేసినా బరువు తగ్గడం లేదా?

image

జిమ్‌లో కసరత్తులు, డైలీ జాగింగ్ చేసినా బరువు తగ్గడం లేదని చాలా మంది మదనపడుతుంటారు. అయితే క్యాలరీలను అతిగా బర్న్ చేశామని భావించడం, వ్యాయామం తర్వాత ఎక్కువగా తినడం దీనికి కారణం కావచ్చని డైటీషియన్లు అంటున్నారు. ‘ఎక్ససైజ్ చేస్తున్నామని రోజువారీ దినచర్యపై నిర్లక్ష్యం వహించడం, సరిగ్గా నిద్రపోకపోవడం కూడా కారణం కావచ్చు. జిమ్‌తోపాటు క్రమశిక్షణ ముఖ్యం. కఠిన డైట్ కొనసాగించాలి’ అని సూచిస్తున్నారు.

News February 16, 2026

మున్సిపోల్స్: మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక నేడే

image

TG: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్లు, 7 కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఇవాళ జరగనుంది. <<19147238>>కరీంనగర్ మినహా<<>> మిగతా కార్పొరేషన్లన్నీ కాంగ్రెస్‌కే దక్కే అవకాశముంది. మరోవైపు 60కి పైగా మున్సిపాలిటీలను ఆ పార్టీ ఇప్పటికే కైవసం చేసుకుంది. ఈ క్రమంలో హంగ్ ఏర్పడిన చోట ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఇండిపెండెంట్లు కీలకంగా మారారు.

News February 16, 2026

విజయవాడలో నేడు బిల్ గేట్స్ పర్యటన.. వివరాలివే!

image

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధినేత బిల్ గేట్స్ సోమవారం విజయవాడలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కీలక రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించేందుకు ఆయన తన బృందంతో కలిసి వస్తున్నారు. ఉదయం 8:10 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన సచివాలయం చేరుకుంటారన్నారు. అలాగే మధ్యాహ్నం 12:40కు పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య స్టేడియంకు విచ్చేయనున్నారు.