News January 31, 2025
పార్వతీపురం: ఎస్పీగా బాధ్యతలు..24 గంటల్లోనే ఉద్యోగ విరమణ

పార్వతీపురం జిల్లా అదనపు ఎస్సీగా గురువారం ఎల్.నాగేశ్వరి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆమె అమరావతి నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. కాగా విధుల్లో చేరిన 24 గంటల్లో తాను విద్యాభ్యాసం ప్రారంభించిన పార్వతీపురంలో ఉద్యోగ విరమణ చేయనుండడం విశేషం
Similar News
News November 7, 2025
VJA: మాజీ డీసీపీ విశాల్ గున్ని కేసు అప్డేట్ ఇదే.!

విజయవాడ మాజీ డీసీపీ విశాల్ గున్ని సస్పెన్షన్ను ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు తక్షణం విధుల్లోకి తీసుకొని ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని ఇటీవల క్యాట్ ఉత్తర్వులను ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని విచారణను వాయిదా వేయాలి’ అని ప్రభుత్వ న్యాయవాది కోరారు. విచారణను నవంబర్ 11కి వాయిదా వేసింది.
News November 7, 2025
రెబ్బెన: హత్య కేసు నిందితుడు పరార్!

హత్య కేసులో విచారణ కోసం తీసుకొచ్చిన ఓ నిందితుడు రెబ్బెన పోలీస్ స్టేషన్ నుంచి పరారు కావడం కలకలం రేపింది. చేతికి వేసిన సంకెళ్లతో స్టేషన్ నుంచి పారిపోయినట్లు సమాచారం. 5 రోజుల క్రితం తిర్యాణి మండలం పిట్టగూడాకి చెందిన హన్మంత్ రావును అదే గ్రామానికి చెందిన సిడం వినోద్ గొడ్డలితో నరికి చంపాడు. దీంతో వినోద్ను పోలీసులు తీసుకొచ్చి విచారించారు. కాగా 4 రోజులుగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
News November 7, 2025
ముందు ‘రూ./-’ వెనక ‘మాత్రమే’ ఎందుకు?

చెక్స్ లేదా చందా బుక్స్ తదితరాలపై అమౌంట్ రాసేటప్పుడు అంకెల ముందు ‘రూ.’ అని పెడతాం (Ex: రూ.116/-). ఇక అక్షరాల్లో రాస్తే చివర్లో ‘మాత్రమే’ (Ex: వంద రూపాయలు మాత్రమే) పేర్కొంటాం. ట్యాంపర్ ప్రూఫ్ సెక్యూరిటీ రీజన్తో ఈ పద్ధతి మొదలైంది. ఇప్పుడంటే కంప్యూటర్ యుగం కానీ ఒకప్పుడు చేతి రాతలతో మాన్యువల్గా పనులు జరిగేవి. దీంతో అమౌంట్ ముందు లేదా వెనక ఏ నంబర్/పదం యాడ్ చేయలేకుండా బ్యాంకులు ఈ పద్ధతి మొదలుపెట్టాయి.


