News March 1, 2025

పార్వతీపురం: ఒక్క నిమిషం .. వారి కోసం..!

image

పార్వతీపురం జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాల్లో 17,849 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులను ఉదయం గం.8.30 ని.ల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.

Similar News

News March 1, 2025

లక్కర్ దొడ్డి: గుండెపోటుతో వ్యక్తి మృతి..!

image

నర్వ మండల కేంద్రంలో గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల వివరాలిలా.. లక్కర్ దొడ్డి గ్రామానికి చెందిన అవుసలి బాలకృష్ణయ్య(80) వడ్రంగి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు తెల్లవారుజామున ఛాతిలో నొప్పి రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. మార్గం మధ్యలో మృతిచెందారు.

News March 1, 2025

పచ్చబొట్లతో HIV, హెపటైటిస్ ముప్పు!

image

పచ్చబొట్లు వేసేందుకు వాడుతున్న ఇంక్, అపరిశుభ్రత విధానాలతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కర్ణాటక ప్రభుత్వం గుర్తించింది. నాసిరకం రసాయనాలు వాడి వేస్తున్న టాటూలలో చర్మ క్యాన్సర్ వస్తున్నట్లు నిర్ధారించింది. అలాగే రోడ్డు పక్కన శుభ్రత లేకుండా, సూది మార్చకుండా పచ్చబొట్టు వేస్తుండటంతో HIV, హెపటైటిస్ సోకుతున్నట్లు వైద్యశాఖ తెలిపింది. పచ్చబొట్లపై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయాలని ఆ ప్రభుత్వం కోరింది.

News March 1, 2025

తగ్గేదే లే అంటోన్న ‘లక్కీ భాస్కర్’

image

థియేటర్ ఆడియన్స్‌ను మెప్పించిన దుల్కర్ సల్మాన్ మూవీ ‘లక్కీ భాస్కర్’.. ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. మూవీలోని భాస్కర్ పాత్రకు ఫ్యామిలీ ఆడియన్స్ ముగ్ధులయ్యారు. గతేడాది నవంబర్ 28న ‘నెట్‌ఫ్లిక్స్’లో రిలీజ్ కాగా.. అత్యధిక వ్యూస్(19.4M) సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. ఆ తర్వాత హాయ్ నాన్న (17.3M), గుంటూరుకారం (16.6M), సలార్ (15.4M), దేవర (12M), కల్కి(10.3M), సరిపోదా శనివారం (9.5M) ఉన్నాయి.

error: Content is protected !!